క్రికెట్ ప్రేమికులకు మరో శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రీడల పోటీల్లో ఒలింపిక్స్ కు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. క్రీడాకారులకు విశ్వక్రీడల్లో పాల్గొని పతకం సాధించాలనేది ఓ కల. ఇప్పుడా ఒలింపిక్స్ లో క్రికెట్ను భాగం చేసేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. ఈమేరకు ఐఓసీకి ప్రతిపాదించామని.. బిడ్ కూడా వేయనున్నట్లు ప్రకటించింది. ఐసీసీ ప్రయత్నాలు ఫలిస్తే.. 2028 లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను చూడొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది క్రికెట్ అభిమానుల్లో 90 శాతం మంది ఒలింపిక్స్లో క్రికెట్ చేర్చాలని కోరినట్లు ఐసీసీ వెల్లడించింది. గతంలో 1900 లో జరిగిన ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చగా రెండు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. 2028లో మళ్లీ క్రికెట్ను చేర్చితే 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ ఆడినట్టవుతుంది. ఈ ఈవెంట్లో క్రికెట్ ను టీ20 లేదా టీ10 గా నిర్వహించే యోచనలో ఐసీసీ ఉందని తెలుస్తోంది. ఒలింపిక్స్ క్రికెట్ ను చేర్చాలని బీసీసీఐ కూడా పట్టుబడుతోంది.
Wenn Sie finden Neben Aspekte der Dienstleistungen der Information sollte werden leicht Begegnung online.
505143 434216Yeah bookmaking this wasnt a bad decision excellent post! . 956472
839727 753717It is difficult to get knowledgeable individuals within this topic, nevertheless, you appear to be guess what happens you are dealing with! Thanks 515096