ఈ ఏడాది ఆరంభం నుండి ప్రపంచ దేశాలను ఒకే ఒక్క విషయం భయపెడుతుంది. అదే కరోనా వైరస్. ఒక్క విషయం గురించి ప్రపంచ దేశాలు అన్ని మాట్లాడుకోవడం ఇదే ప్రథమం అయ్యి ఉంటుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా కారణంగా ప్రపంచంలోని జనాలు అతలాకుతం అవుతున్నారు. దేశ విదేశాలకు వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రస్తుతం రెండు కోట్ల మందికి పైగా సోకినట్లుగా తెలుస్తోంది. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్యను ఊహించలేం అంటున్నారు.
ఇంతటి భయంకర వైరస్ గత ఏడాదిలో పుట్టిందని ఇన్నాళ్లు శాస్త్రవేత్తలు భావించారు. కాని అసలు విషయం ఏంటీ అంటే ఈ వైరస్ అనేది చాలా చాలా ఏళ్లుగా ఉంటూనే ఉంది. అయితే బయట పడలేదు. గబ్బిలాల్లో కొన్ని వందల ఏళ్లుగా ఈ వైరస్ కొనసాగుతూ వస్తుందని, కాని ఇన్నాళ్లు దాన్నిలో ఉన్న కరోనాను గుర్తించడంలో శాస్త్రవేత్తలు విఫలం అయ్యారు. ఇప్పుడు కరోనా వైరస్ జనాలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన పెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో ఇది ఎప్పటి నుండో ఉన్నట్లుగా గుర్తించారు. కరోనా మూలాలు గబ్బిలంలో ఉన్నవని గుర్తించడం వల్ల వ్యాక్సిన్ను తీసుకు రావడం మరింత ఈజీ అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
143018 214824I consider something truly interesting about your website so I saved to fav. 544462