Switch to English

నిప్పు పెట్టేటోళ్ళని అరెస్ట్ చెయ్యరెందుకు చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపైనా, ఆయన తనయుడు నారా లోకేష్ పైనా సంచలన రీతిలో విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ‘తండ్రీ కొడుకులు చెరో అగ్గిపెట్టె పట్టుకుని.. అటు వైపునుంచి, ఇటువైపునుంచి తగలబెట్టేద్దామని (రాష్ట్రాన్ని) చూస్తున్నారు..’ అన్నది మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన తాజా విమర్శ. ఇదే విమర్శ, వైసీపీకి చెందిన ఏ ఎమ్మెల్యేనో, ఎంపీనో, చోటామోటా నాయకులో చేస్తే అదొక లెక్క. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్నారు బొత్స సత్యనారాయణ. ప్రతిపక్ష నేత మీద ఇంత తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసేముందు ఒకటికి పదిసార్లు ఆయన ఆలోచించుకుని వుండాల్సింది.

 

కొన్నాళ్ళ క్రితం వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలో విగ్రహాల కూల్చివేత, రధాల దగ్ధం గురించి మాట్లాడుతూ, ‘రథాల్ని తగలబెట్టినవాళ్ళే రధయాత్రలు చేస్తున్నారు.. విగ్రహాల్ని ధ్వంసం చేసినవారే.. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు..’ అంటూ విమర్శించారు. అధికారంలో వున్నది వైసీపీనే. కుట్రలకు పాల్పడుతున్నదెవరో అధికార పార్టీ దగ్గర, అందునా ముఖ్యమంత్రి దగ్గరా, మంత్రుల దగ్గరా సమాచారం వుంటే, ఎంచక్కా కుట్రదారుల్ని అరెస్ట్ చేసేసి లోపలేసెయ్యాలి. కానీ, అలా జరగడంలేదు రాష్ట్రంలో. ఏదో సరదాకి.. అన్నట్టు మీడియా ముందుకొచ్చి నాలుగు విమర్శలు చేసి పోవడం ప్రభుత్వ పెద్దలకు ఓ అలవాటుగా మారిపోయిందన్న విమర్శలు సాధారణ ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగానే వున్నాయి.

 

పదో తరగతి విద్యార్థులు.. పరీక్షలొద్దు మొర్రో.. అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో, ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.. వైద్యం అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితినీ చూస్తున్నాం. వాటిపై విపక్షాలు మాట్లాడితే, ‘అగ్గిపెట్టె పట్టుకుని తగలబెట్టెయ్యడానికి సిద్ధంగా వున్నారు’ అని ఓ మంత్రి అనడమేంటి.? ఆరోపణకు తగ్గ ఆధారాలుంటే, ప్రభుత్వ పెద్దలు, కుట్రదారుల్ని అరెస్ట్ చేయాలి ఇకనైనా. అది చేతకానప్పుడెందుకీ టైమ్ పాస్ విమర్శలు.? ఇదిలా వుంటే, ఈ రోజు.. కొత్తగా రాష్ట్రంలో 74,041 టెస్టులు చేయగా 9881 కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. చిత్రమేంటంటే, ముందు రోజు.. అంటే నిన్న, 62,885 టెస్టులు చేస్తే 12,634 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం. టెస్టుల సంఖ్య పెరిగితే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగానే పెరుగుతాయి. కానీ, ఇక్కడ దాదాపు 3 వేల కేసులు పెరిగాయి.. 12 వేల టెస్టులు పెరిగితే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...