‘ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు.. అదే సమయంలో అప్రమత్తంగా వుండాల్సిందే.. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజలకు భరోసా ఇస్తూనే, కరోనా పట్ల స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తోంటే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఆలోచనలు అందుకు భిన్నంగా వున్నాయి. ఫలితం, ఒక్క రోజే 67 కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో.
తెలంగాణ కంటే ముందే, ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సెంచరీ దాటేసింది. ఆ తర్వాత తెలంగాణ కూడా సెంచరీ కొట్టేసిందనుకోండి.. అది వేరే విషయం. ప్రపంచానికి పెను ముప్పులా పరిణమించిన కరోనా వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి.
తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ, ‘కరోనా వైరస్ని అంటరానిదిగా చూడొద్దు..’ అంటూ ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతోంది. ‘చిన్నపాటి అక్షర దోషం’ అని సరిపెట్టుకోవడానికి వీల్లేని పరిస్థితి ఇది. ఎందుకంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే కరోనా వైరస్ని లైట్ తీసుకుంటున్నారు. ఆ ప్రభావాన్ని చాలా చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. 80 శాతం మందికి ప్రత్యేక వైద్యం అవసరం లేదని వైఎస్ జగన్ చెప్పిన మాటలే కేసీఆర్ చెబుతున్నా.. అనేక సర్వేలూ చెబుతున్నా.. ఆ చెప్పే మాటల్లోని ‘డిక్షన్’ విషయంలో వైఎస్ జగన్ చాలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు కన్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్, గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయిందా.? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇంకా ‘కమ్యూనిటీ ట్రాన్స్మిషన్’ స్థాయికి వెళ్ళలేదని వైద్య నిపుణులు చెబుతుండడం కాస్త ఊరట. ఇటలీలో ఏం జరుగుతోందో చూస్తున్నాం.. అమెరికాలో పరిస్థితి ఏంటో తెలుసుకుంటున్నాం.. అయినా, మనం జాగ్రత్త పడకపోతే ఎలా.?
157254 340139I actually prize your piece of function, Fantastic post. 417636
8178 273786You produced some decent points there. I looked over the internet for any issue and identified most individuals goes as effectively as together with your internet site. 51934
466176 626912Hello! I just now would decide on to supply a enormous thumbs up with the fantastic info you can have here within this post. I will likely be coming back to your blog internet site for additional soon. 328385