Switch to English

కరోనా టెర్రర్‌: పత్రికలు కనుమరుగయ్యేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) సృష్టిస్తోన్న సంక్షోభం అంతా ఇంతా కాదు. ప్రపంచంలో అన్ని దేశాలూ కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఆయా రంగాలు ముందు ముందు పెను సంక్షోభాన్ని ఎదురుచూడాల్సి వస్తోందన్న ఆందోళనతో బెంబేలెత్తుతున్నాయి. పత్రికా రంగానికి ఈ కరోనా వైరస్‌ కారణంగా తగులుతున్న దెబ్బ చిన్నదేమీ కాదు.! అయితే, ఇది నాణానికి ఓ వైపు మాత్రమే.

నిజానికి, పత్రికా రంగానికి గత కొంత కాలంగా సవాళ్ళు ఎదురవుతూనే వున్నాయి. పొద్దున్నే వచ్చే పత్రిక కోసం ఎదురుచూసేవారు తక్కువవుతున్నారు ‘స్మార్ట్‌’ ప్రపంచం కారణంగా. మినిట్‌ టు మినిట్‌ అప్‌డేట్స్‌ మొబైల్‌ ఫోన్లలో దర్శనమిస్తోంటే, ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా ఆ ధాటిని తట్టుకోలేకపోతోంది.. పత్రికా రంగం ఇంకెలా తట్టుకుంటుంది.? సరిగ్గా ఈ టైమ్ లోనే కరోనా వైరస్‌ పెను ముప్పు తీసుకొచ్చింది. దాంతో, ప్రింట్‌ వెర్షన్లను అటకెక్కించేయాలనే ఆలోచనలు చేస్తున్నాయి ప్రముఖ మీడియా సంస్థలు.

తెలుగునాట ఈనాడు సంస్థ కూడా అదే ఆలోచన చేయబోతోందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. అది కొద్ది రోజుల్లోనే అమల్లోకి రాబోతోందట. పేజ్‌ లే అవుట్‌ డిజైనర్లను తగ్గించడం ఇప్పటికే షురూ అయ్యిందట ఈనాడు సంస్థలో. ఇతర పత్రికల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. కొందరికి మూడు నెలల జీతం ఇచ్చేసి సాగనంపుతున్నారు ఈనాడులో.. అంటూ మీడియా సర్కిల్స్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

ట్యాబ్లాయిడ్లు ఆగిపోవడంతో ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దాంతోపాటుగానే, కొందరు ఉద్యోగులపై వేటు కూడా పడిందంటున్నారు. ఆంధ్రజ్యోతి, సాక్షి తదితర పత్రికలూ ఇందుకు మినహాయింపేమీ కావు. వైసీపీ అధికారంలో వుంది గనుక, సాక్షికి ఇప్పట్లో ఇబ్బందులుండకపోవచ్చు. కానీ, పత్రికాధిపతులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుంటే.. అతి త్వరలో తెలుగు నాట పత్రికల తాలూకు ప్రింటెడ్‌ వెర్షన్స్‌ ఆగిపోవచ్చని అంటున్నారు.

‘ఇది తాత్కాలిక నిలుపుదల కాకపోవచ్చు.. నిలుపుదల శాశ్వతంగానే వుండొచ్చేమో..’ అని సీనియర్‌ జర్నలిస్టులు కొందరు అభిప్రాయపడ్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ప్రింట్‌ వెర్షన్లు లేకపోయినా, డిజిటల్‌ వెర్షన్లు అందుబాటులో వుంటాయట. అయితే, వాటిల్లోనూ కొత్త సాంకేతికత వినియోగం దిశగా మీడియా సంస్థల యాజమాన్యాలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పత్రికా రంగం దశాబ్దాలుగా ఎన్నో సంక్షోభాల్ని ఎదురుచూసింది.. కానీ, ధీటుగా ఎదుర్కొంది. ఈసారి, మాత్రం తట్టుకుని నిలబడే పరిస్థితుల్లో లేదనీ, దానికి కేవలం కరోనా వైరస్‌ మాత్రమే కారణం కాదనీ, ఇతరత్రా కారణాలతోపాటు, కరోనా ఎఫెక్ట్‌ కూడా వుంటుందన్నది విశ్లేషకులు చెబుతున్నమాట.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...