తెలుగు దేశం పార్టీ ప్రథాన నాయకుడు.. ఎమ్మెల్సీ నారా లోకేష్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించాడు. కరోనా స్వల్ప లక్షణాలతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడు. నారా లోకేష్ ఇటీవల సంక్రాంతి సందర్బంగా కార్యకర్తలతో వేడుక జరుపుకున్నాడు. దాంతో ఇప్పుడు అందులో ఎంత మందికి కరోనా ఉండి ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి నుండి లోకేష్ కి వచ్చి ఉంటుంది.. ఇప్పుడు లోకేష్ నుండి మరెవ్వరికి కరోనా సోకింది అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం లోకేష్ పూర్తిగా విశ్రాంతి మూడ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వైధ్యులు స్వల్ప లక్షణాలు కనుక ఇంట్లోనే ఐసోలేషన్ అవ్వాల్సిందిగా సూచించినట్లుగా తెలుస్తోంది. కొడుక్కు మరియు ఇతర కుటుంబ సభ్యులకు నారా లోకేష్ దూరంగా ఉంటున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వారం రోజుల్లో లోకేష్ తిరిగి జనాల్లోకి వస్తాడనే నమ్మకంను టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కరోనా పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు ఆయన సూచించాడు.
64292 96119A weblog like yours should be earning much funds from adsense.~::- 323398