Switch to English

కరోనా మీటర్‌: నరేంద్ర మోడీ గ్రాఫ్‌ పెరిగిందా? తగ్గిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

రాజకీయాల గురించి మాట్లాడుకునే సమయమా ఇది.? అని అధికారంలో వున్న రాజకీయ పార్టీలు ప్రశ్నించొచ్చుగాక. కానీ, ఆ అధికార పార్టీలే ఇప్పుడు చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నాయి.! అదే రాజjకీయం అంటే. ‘నేను చేస్తే శృంగారం.. ఇంకెవడన్నా చేస్తే వ్యభిచారం..’ అన్నట్టు రాజకీయ పార్టీలు వ్యవహరించడం మామూలే.

అసలు విషయానికొస్తే, నెలన్నరగా దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. దేశమంతా లాక్‌డౌన్‌లో వుంది. ఈ క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతవరకు ప్రజల మనసుల్ని గెల్చుకుంది.? అన్న విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జన్‌ధన్‌ ఖాతాల్లో డబ్బులు వేయడం.. పేదలకు రేషన్‌ అందించడం సహా.. పలు కీలక చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా, రాష్ట్రాలూ తమవంతుగా ప్రజల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు మాత్రం అత్యంత భయానకంగా వున్నాయన్నది నిర్వివాదాంశం.

ఓ వ్యక్తి 1500 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి, చివరికి గమ్యస్థానం చేరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి వార్తలు ఇటీవలి కాలంలో చాలానే చూశాం. ఆకలి చావుల సంగతి సరే సరి.! ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క. లాక్‌డౌన్‌ ముగిశాక అసలు సిసలు నష్టం ఏంటో తెలుస్తుంది.. అని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్న వేళ, నరేంద్ర మోడీ పాలనకు సంబంధించి కరోనా మీటర్‌ రీడింగ్‌ ఏం చెబుతోంది.? అన్న చర్చ సర్వత్రా జరగడం సహజమే.

లాక్‌డౌన్‌ అంటే చెప్పాపెట్టకుండా వచ్చేసిందిగానీ.. కరోనా వైరస్‌ అలా కాదు. ముందుగా చైనాని ముంచేసింది.. అప్పుడే ప్రపంచదేశాలు అలర్ట్‌ అయి వుండాలి. మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. ‘మూడు నాలుగు రోజుల తర్వాత ఎందుకు.? ఇప్పుడే అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఆపేయొచ్చు కదా..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం విదితమే. అప్పటికి దేశంలో వున్న పరిస్థితి కేసీఆర్‌ మాటల్లో సుస్పష్టమయ్యింది. కానీ, ‘కూడికలూ.. తీసివేతలూ..’ చాలానే లెక్కేసుకుని.. తాపీగా అంతర్జాతీయ విమాన రాకపోకల్ని కేంద్రం ఆపింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

తబ్లిగీ జమాత్‌ లెక్క కారణంగా దేశంలో కేసులు అనూహ్యంగా పెరిగాయన్నది ఇంకో కీలకమైన అంశం. అంతలా జనం ఒకే చోట మత కార్యక్రమాల కోసం పోగైతే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు.? అదీ కరోనా వైరస్‌ అప్పటికే ప్రపంచాన్ని చుట్టేస్తున్న సందర్భం. ఇలా ఏ కోణంలో చూసుకున్నా మోడీ సర్కార్‌ ఫెయిల్యూర్‌ సుస్పష్టం. ఎవరన్నా ప్రశ్నిస్తే, ఎదురుదాడికి దిగడం బీజేపీ నేతలకు అలవాటైపోయిందిగానీ.. మోడీ సర్కార్‌ వైఫల్యానికి దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నది నిర్వివాదాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

Uppena : హిందీ ‘ఉప్పెన’ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్‌ గా కృతి శెట్టి లు నటించిన...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...