కరోనా మొదటి వేవ్.. జనాల్ని భయపెట్టింది.. కరోనా సెకెండ్ వేవ్ ఇంకా ఇంకా గట్టిగా భయపెట్టింది. మొదటి వేవ్ దెబ్బకి ప్రభుత్వాలు విలవిల్లాడాయ్.. రెండో వేవ్ దెబ్బకి ప్రభుత్వాలు వణికాయ్.. ఇప్పుడు రెండో వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది.. దేశంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల్ని సడలిస్తూ వస్తున్నాయి. ‘పరిస్థితిపై పూర్తిస్థాయిలో అంచనా వేశాకే లాక్ డౌన్ సడలింపులు చేయాలి..’ అని కేంద్రం, రాష్ట్రాల్ని హెచ్చరించి ఊరుకుంది. నిజానికి, రెండో వేవ్ సందర్భంగా కేంద్రం పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకుంది.. రాష్ట్రాల నెత్తిన పూర్తి బాధ్యత పడేసింది.
ఆక్సిజన్ సరఫరా, రెమిడిసివిర్ లాంటి మందుల సరఫరా, వ్యాక్సిన్ల సరఫరా.. వంటివి మాత్రమే చేపట్టింది కేంద్రం. లాక్ డౌన్ విషయంలో అస్సలు కేంద్రం పట్టించుకోలేదు.. రాష్ట్రాలకు పెద్దన్నలా వ్యవహరించలేదు. వివిధ రాష్ట్రాల్లో అన్ లాక్ ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో అయితే, రేపటి నుంచి నో లాక్ డౌన్.. పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి, అంతా బాగున్నట్టేనా.? కరోనా మూడో వేవ్ భయాలేమీ అవసరం లేదా.? అంటే, కరోనా ప్రోటోకాల్ ప్రకారం ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటోంది తెలంగాణ ప్రభుత్వం.
అయిపాయె.. ఇకపై బాధ్యత ప్రజలదేనన్నమాట. ఔను, నిజానికి కరోనా విషయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వుండడమే అత్యంత ముఖ్యమైన విషయం. కానీ, 95 శాతం మంది ప్రజలు బాధ్యతగా వుండి, మిగిలిన ఐదు శాతం మంది నిర్లక్ష్యంగా వుంటే చాలు.. పెను విధ్వంసం చోటు చేసుకుంటుంది. కరోనా ప్రత్యేకతే అది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రాష్ట్రాల్లో అవసరమైన మేర కరోనా వ్యాక్సిన్ లభ్యత లేదు. మరెలా లాక్ డౌన్ సంపూర్ణంగా ఎత్తివేస్తారు.? పైగా మూడో వేవ్ భయాలున్నా.. స్కూళ్ళు సైతం జులై 1 నుంచి తెరిచేస్తామంటోంది తెలంగాణ. ఎవరి చావుకి ఎవరు బాధ్యులు.? అన్నట్టుంది ప్రభుత్వం తీరు.
970715 787123I discovered your web site site online and check a lot of of your early posts. Maintain on the top notch operate. I just now additional your Feed to my MSN News Reader. Seeking for forward to reading significantly far more from you obtaining out later on! 703687