ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ కారణముగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఎంతో కొంత కరోనాని కట్టడి చేయగలిగారు. కానీ అన్ని చోట్లా ఆర్ధిక ఇబ్బందుల వలన లాక్ డౌన్ సడలింపులు రావడంతో కరోనా మళ్ళీ విజృభిస్తోంది. ఇండియాలో కూడా లాక్ డౌన్ సడలింపులు ఎక్కువగానే ఉండడంతో రోజు రోజుకీ రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఘననీయంగా పెరుగుతోంది.
గత 24 గంటల్లోనే ప్రపంచం మొత్తం మీద లక్షకి పైగాకేసులు నమోదయ్యాయి. ఈ రేంజ్ లో కేసులు నమోదవ్వడం ఇదే మొదటి సారి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 45 లక్షల మార్క్ ని క్రాస్ చేసింది. అలాగే మరణాలు కూడా 3 లక్షలు దాటాయి.
గత 24 గంటల్లో చూస్కుంటే ఒక్క అమెరికాలోనే 26,398 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 1,703 మంది కొరోనాతో మరణించారు. అలాగే బ్రెజిల్ లో 13,761 కొత్త కేసులు నమోదవ్వగా, 835 మంది చనిపోయారు. అలాగే రష్యాలో 9,974 మరియు ఇండియాలో 3,942 అత్యధిక కేసులు నమోదవ్వగా, అత్యధికంగా చనిపోయిన దేశాల్లో బ్రిటన్(428), ఇటలీ(262), స్పెయిన్(217), ఫ్రాన్స్(351), మెక్సికో(294), కెనడా(170)లు ఉన్నాయి.
783206 843176I conceive this web site has got some real great info for everybody : D. 840390