ప్రస్తుతం ప్రపంచ జనాభాని, ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి పేరు కరోనా వైరస్. ఈ వైరస్ పుట్టింది చైనాలో అయినా భారీగా నష్టపోయింది మాత్రం ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకూ అమెరికాలో అధికారికంగా 16,88,709 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 99,348 మంది చనిపోయారు. ఇవి అధికారికంగా చెబుతున్న లెక్కలు కానీ వీటికి మించే కరోనా కేసులు, మరణాలు ఉంటాయని అక్కడి మీడియా సమాచారం.
వీటిని బేస్ చేసుకొని అమెరికాలోనే అగ్రశ్రేణి వార్తా పత్రికల్లో ఒకటైన ‘న్యూయార్క్ టైమ్స్’ వారు ఆదివారం(మే 24న) నాడు ఏ పత్రికా చేయని విధంగా ఓ సంచలనం సృష్టించి, అందరి దృష్టినీ ఆకర్షించింది. అదేమిటంటే.. న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ఫ్రంట్ పేజీలో ఒక్క వార్తని కూడా ప్రచురించకుండా, ‘లక్షకి చేరువలో అమెరికా మరణాలు, లెక్కకట్టలేనంత నష్టం’ అని హెడ్ లైన్ పెట్టి ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి చనిపోయిన వారందరి పేరు మరియు అడ్రస్ ని ప్రచురించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక చేసిన ఈ ప్రచురణ వరల్డ్ వైడ్ పెద్ద సెన్సేషన్ అయ్యి కూర్చుంది. గత ఒకటి రెండు రోజులుగా ఏంటో కొంత కరోనా తగ్గుముఖం పడుతుందని కొన్ని కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే ఇకపై అమెరికాలో కరోనా మరణాలు తగ్గే అవకాశం ఉంది.
429698 790484You made some respectable points there. I looked on the internet for the concern and identified a lot of people will go along with together with your web site. 977840