దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సైతం దారుణ పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. తాజాగా తెలంగాణలో మొట్టమొదటి ప్రైమరీ కాంటాక్ట్ కేసు నమోదైంది. అంటే వైరస్ సోకిన వ్యక్తి ద్వారా ఇక్కడి వ్యక్తికి కరోనా రావడం.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన కేసులన్నీ ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చినవారే. వారందరికీ విదేశాల్లో ఉన్నప్పుడే ఆ వైరస్ సోకినా.. ఇక్కడకు వచ్చిన తర్వాతే వెలుగు చూసింది. ఇక్కడ ఉన్నవారికి ఇప్పటివరకు కరోనా సోకలేదు. అలాంటిది తాజాగా వైరస్ సోకిన వ్యక్తి ద్వారా ఇక్కడ ఉన్న మరో వ్యక్తికి కరోనా సోకిన విషయం తాజాగా నిర్ధారణ అయింది.
ఇలా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా నివారించేందుకే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 24 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. దేశంలో ఆ సంఖ్య 283కి చేరింది. దీంతో పరిస్థితి తీవ్రత పెరుగుతున్న సంగతి గుర్తించిన సీఎం కేసీఆర్ కఠిన చర్యలు చేపట్టారు. అవసరమైతే రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్తామని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ప్రతిపాదించిన 14 గంటల జనతా కర్ఫ్యూని 24 గంటలు చేద్దామని పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కదని, మెట్రో సేవలు కూడా నిలిపివేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న సంగతి జనం అందరూ గుర్తించి ఆ మేరకు తగిన నివారణ చర్యలు తీసుకోవడం చాలా ఉత్తమం.
352680 983082I havent checked in here for some time because I thought it was obtaining boring, but the last couple of posts are truly good quality so I guess Ill add you back to my every day bloglist. You deserve it my friend. insurance guides 838981