దేశంలో కొత్త కరోనా కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి స్థిరంగానే కొనసాగుతోంది. అయితే.. రాజధాని ఢిల్లీలోనే 50శాతం మేర కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్రం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే..
గడచిన 24 గంటల్లో 4.34లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,007 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ముందు రోజు 202 కేసులు నమోదు కాగా.. నిన్న 299 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివిటీ రేటు 2.70 శాతానికి పెరిగింది. నిన్న దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1గా.. మహారాష్ట్రలో నమోదైంది. నిన్న ఒక్కరోజే కరోనాతో 818 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,058గా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిరంతరంగా కొనసాగుతోంది. నిన్న 14.48 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోగా.. మొత్తంగా 186కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
311348 263073Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to search out any person with some distinctive thoughts on this subject. realy thank you for starting this up. this web internet site is 1 thing thats necessary on the net, someone with a bit of originality. beneficial job for bringing something new towards the internet! 802937
362677 413412What is excellent respecting is dealing with instead of depending on. 837847