దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో 2,64,2020 మందికి కరోనా సోకింది. ముందు రోజుకంటే ఇది 6.7 ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఈ కేసుల సంఖ్య 5,753కి పెరిగింది. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 12 లక్షలు దాటాయి.
నిన్న ఒక్కరోజే కరోనాతో 315 మంది మరణించారు. మొత్తంగా 4.85 లక్షల మంద కరోనాతో మృతి చెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1లక్షకు పైగా ఉంది. దేశంలో ఇప్పటివరకూ 3.65 కోట్ల మందికి కరోనా సోకగా 3.48 కోట్ల మంది కోలుకున్నారు. దీంతో రికవరీ శాతం 95.20గా నమోదైంది.
దేశంలో టీకా కార్యక్రమం జోరుగా సాగుతోంది. నిన్న 73 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 15-18 మధ్య వయసు వారికి 3.14 కోట్ల డోసులు అందాయి.