దేశంలో కరోనా కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోంది. కొన్నిరోజుల క్రితం రోజుకు మూడు లక్షలకు పైగానే నమోదైన కేసులు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా మూడు లక్షలకు దిగువనే కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2.51 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించింది.
మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తూండగా.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పాజిటివిటీ పెరుగుతోంది. కేరళలో నిన్న 51వేలు నమోదైతే.. ఇందులో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్టు ఆ రాష్ట్రం తెలిపింది. మరోవైపు కరోనాతో నిన్న ఒక్కరోజే 627 మంది ప్రాణాలు కోల్పోతే.. కేరళలోనే 153 మంది ఉన్నారు.
కరోనా నుంచి నిన్న 3,47,443 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ శాతం 93.60 శాతంగా నమోదైంది. నిన్న ఒక్కరోజే 57.3 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. మొత్తంగా దేశంలో 164 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.
71144 721353Sweet internet site , super style , actually clean and utilize genial . 346134