దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 3,33,533 మంది కరోనా బారిన పడ్డారు. ముందురోజుతో పోలిస్తే ఈ సంఖ్య కొంత తక్కువే.. అయినా పాజిటివిటీ రేటు 17.22 నుంచి 17.78 శాతానికి పెరడగం ఆందోళన కలిగిస్తోంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది.
కరోనాతో ఒక్కరోజులో 525 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 21,87,205 క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.92 కోట్లు దాటగా.. 4,89,409 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 2,59,168 మంది కోలుకున్నారు.
దేశంలో ఇప్పటివరకు 161.92 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 71.10 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. 15–18 ఏళ్ల మధ్య వయసు వారికి 4,15,77,103 మందికి వ్యాక్సిన్ వేయగా.. ప్రికాషనరీ డోసులు 80,10,256 మందికి వేశారు.
236476 307332Enjoyed reading via this, extremely good stuff, thankyou . 257060
565171 212912Perfect just what I was looking for! . 788892