Switch to English

ఏపీలో కరోనా లెక్కలు తగ్గాయ్‌.. కండిషన్స్‌ అప్లయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గాయ్‌. నిన్నటి లిస్ట్‌లో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137గా పేర్కొంది ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ. కానీ, చిత్రంగా ఈ రోజు 68 కొత్త కేసులు నమోదైతే, మొత్తం లెక్కని 2100గా చూపిస్తోంది. ఇక్కడ ‘మతలబు’ ఏంటి.? అని అంతా విస్తుపోతున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా నమోదైన కేసులు 2100 అట. వీటికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి లెక్క కలిపితే, ఇంకాస్త ఎక్కువట. అంటే, మైగ్రెంట్స్‌ లిస్ట్‌ని అసలు లిస్ట్‌ నుంచి వేరు చేశారన్నమాట. ఆ మైగ్రెంట్‌ లెక్క 105. దీనర్థం, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 2205 అవుతుంది.

తెలంగాణలో నిన్న మొత్తంగా 41 కేసులు నమోదు కాగా, అందులో 10 మైగ్రెంట్‌ కేసులు. దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళేందుకు అవకాశాలు కల్పిస్తున్న దరిమిలా, ముందు ముందు ఈ మైగ్రెంట్‌ లెక్కలు మరింత పెరగబోతున్నాయి. ఈ తరుణంలో ‘గందరగోళపు లెక్కలు’ ఏమంత సమర్థనీయం కాదు. మన దేశంలోకి కరోనా వచ్చిందే.. మైగ్రెంట్స్‌ వల్ల. ఇతర దేశాల నుంచి ఈ కరోనా తొలుత మన దేశంలోకి వచ్చింది. ఆ తర్వాత అది సామాజిక వ్యాప్తి వరకూ చేరుకుంది.

ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కస్‌కి వెళ్ళి అక్కడ కరోనా అంటించుకుని వచ్చినవారిని మైగ్రెంట్స్‌ అని అనలేం కదా. చెన్నయ్‌ కోయంబేడు మార్కెట్‌కి వెళ్ళి కరోనా అంటించుకుని వచ్చినవారిని కూడా ప్రత్యేకంగానే చూపుతున్నా, ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులుగానే భావిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా లేదని చెప్పడానికేనా ఈ ‘వేరే’ లెక్క.? అన్న అనుమానం కలుగుతోంది అందరికీ. 2 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేసి ‘ఘనతను’ సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇప్పుడీ గందరగోళం లెక్కలతో అభాసుపాలవుతుండడం దురదృష్టకరం.

ఇదిలా వుంటే, కరోనా క్యాపిటల్‌గా మారిన కర్నూలులో ఈ రోజు కొత్త కేసులు ఏవీ నమోదు కాకపోవడం ఆహ్వానించదగ్గ విషయం. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా రెండు కొత్త కేసులు నమోదవడం గమనార్హం. నెల్లూరులో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 12 కోయంబేడు లింకులున్నవి. చిత్తూరులో మొత్తంగా 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గుంటూరులో ఐదు కేసులు నమోదయ్యాయి. కడప, కృష్ణా జిల్లాల్లో చెరో కేసు నమోదయ్యింది. వెస్ట్‌ గోదావరిలో ఓ కేసు నమోదయ్యింది.

ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 48 కాగా, 1192 మంది కోలుకున్నారు. 860 మంది చికిత్స పొందుతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

డ్రగ్స్ దొంగలెవరు.? రాష్ట్రం ఏమైపోతోంది.?

అబ్బే, రాష్ట్రం ఏమైపోతోందన్న బెంగ ఎవరికీ లేదు. ఎందుకంటే, రాష్ట్రం ప్రధాన రాజకీయ పార్టీలకి ప్రధాన ఆదాయ వనరుగా మారింది తప్ప, రాష్ట్ర శ్రేయస్సు గురించి ఎవరికీ ఎలాంటి చింతా లేదన్నది నిర్వివాదాంశం. విపక్షాల...