Switch to English

బోర్డర్‌ టెన్షన్‌: జగన్‌ అలా విజయసాయిరెడ్డి ఇలా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పింది వినాలా.? వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పింది నిజమనుకోవాలా.? కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం విదితమే. ఎక్కడివాళ్ళు అక్కడే వుండిపోయారు ఇప్పటిదాకా.! కానీ, కేంద్రం కల్పించిన తాజా వెసులుబాట్లతో రాష్ట్రాల మధ్య రాకపోకలు లేకపోయినా.. ప్రత్యేక పరిస్థితుల్లో ఇట్నుంచి, అటు.. అట్నుంచి ఇటు రావడానికి కాస్త వీలు కలిగింది.

గుజరాత్‌ నుంచి మత్సకారులు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కి చేరుకున్న వైనంపై అధికార వైసీపీ చేసిన పబ్లిసిటీ స్టంట్లు చూశాం. వాళ్ళంతా లాక్ డౌన్ నేపథ్యంలో గుజరాత్ లోనే నిన్న మొన్నటిదాకా ఇరుక్కుపోయారు. ‘ఇటలీ నుంచి వచ్చారు.. గుజరాత్‌ నుంచీ వచ్చారు.. హైద్రాబాద్‌ నుంచి చంద్రబాబు, లోకేష్‌ మాత్రం రావడంలేదు..’ అంటూ విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా సెటైర్‌ వేశారు.

ఇంతలోనే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ‘ఎక్కడివారు అక్కడే వుండండి..’ అంటూ ‘బోర్డర్‌’ దాటి వస్తోన్న పొరుగు రాష్ట్రాలకు చెందినవారిని (మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చేవారిని) ఉద్దేశించి విజ్ఞప్తి చేయడం గమనార్హం. ‘రాకపోకలు పెరిగితే, కరోనా వ్యాప్తిని అరికట్టలేం..’ అన్నది వైఎస్‌ జగన్‌ ఆలోచన. అది నిజం కూడా.

అయితే, కేంద్రం ఇచ్చిన వెసులుబాట్లతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళేవారి కోసం ప్రత్యేకంగా పాసుల్ని మంజూరు చేసింది. ఈ పాసులు పట్టుకుని, తెలంగాణలో ఇప్పటిదాకా చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రజలు, తమ సొంతూళ్ళకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే, వారిని బోర్డర్‌లోనే అడ్డుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు. ‘తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాసులతో మాకు సంబంధం లేదు..’ అని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అధికారులు చెబుతుండడం గమనార్హం. దాంతో, మళ్ళీ తెలంగాణ ` ఆంధ్రప్రదేశ్‌ బోర్డర్ల మధ్య టెన్షన్‌ వాతావరణం నెలకొంటోంది.

గతంలో కూడా ఇదే తరహా పరిస్థితులు తలెత్తాయి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాయి.. ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చు జరిగాక, పరిస్థితి కాస్త సద్దుమణిగింది. మరి, ఈసారి ఏమవుతుంది.? విజయసాయిరెడ్డి గొప్పలు జనాల కొంపలు ముంచేస్తున్నాయనుకోవాలా.? ప్రభుత్వంతో సంప్రదించకుండా విజయసాయిరెడ్డి ఓవరాక్షన్‌ చేస్తున్నా, ముఖ్యమంత్రి ఆయన్నెందుకు ఉపేక్షిస్తున్నట్లు.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్,...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో...

రాజకీయం

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

Tillu Square: ‘టిల్లు మనింట్లో తిరిగే మనిషి అయిపోయాడు: ఎన్టీఆర్

Tillu Square: ‘టిల్లు పాత్ర మనందరి జీవితాల్లో భాగమైంది. ఈరోజు టిల్లు మన ఇంట్లో తిరిగే మనిషి. అద్భుతమైన పాత్రని క్రియేట్ చేసినందుకు హ్యాట్సాఫ్ సిద్ధు (Siddhu Jonnalagadda)’ అని కొనియాడారు జూనియర్...

తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంటే అన్నయ్య చిరంజీవి.!

జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి.! ఐదు కోట్లు.. అంటే, కేవలం రూపాయలు కాదు.! ఆశీస్సులు.! ఔను, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి అందించిన ఆశీస్సులు అవి. ‘నేను...

Ram Charan: రామ్ చరణ్ గొప్పదనం అదే.. అందుకే గౌరవ డాక్టరేట్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు రామ్ చరణ్. కళా రంగానికి...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...