దేశంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటేసింది. మరోపక్క, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆయా రాష్ట్రాలూ కరోనా వైరస్ గురించిన అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నా, ‘ఫేక్ న్యూస్’ మాత్రం ఆగడంలేదు.
సోషల్ మీడియా పుణ్యమా అని జనంలో ఆందోళన మరింత తీవ్రమవుతోంది. ఫలానా మందుని వాడొచ్చు, ఇదిగో వ్యాక్సిన్ వచ్చేసింది.. అదిగో అక్కడ కరోనా పేషెంట్ కారణంగా చాలామందికి ఆ వ్యాధి వచ్చిందట.. ఇలాంటి పుకార్లు కుప్పలు తెప్పలుగా విన్పిస్తుండడంతో భయాందోళనలు పెరిగిపోతున్నాయి.
భయాందోళనలు ఓ పక్క ఇలా వుంటోంటే, ఇంకోపక్క కఠిన పరిస్థితుల్లోనూ కొందరు మాత్రం ‘విచ్చలవిడితనం’ కొనసాగిస్తుండడం దురదృష్టకరం. నిత్యావసర వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తోంటే, ఆ పేరుతో బయటకొచ్చి షికార్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘లాక్ డౌన్’ని మరింత కఠినంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమయ్యింది.
తాము వుంటోన్న కాలనీ చుట్టూ కేవలం ఒకటి లేదా రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే నిత్యావసర వస్తువుల కోసం వెళ్ళాల్సి వుంటుందనీ, అంతకు మించి వెళితే మాత్రం కరిన చర్యలు తప్పవని తెలంగాణ పోలీస్ హెచ్చరించింది తాజాగా. మరోపక్క, ఆంధ్రప్రదేశ్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా, ప్రజల్లో అవగాహన పెరగకపోతే కరోనా వైరస్ని నియంత్రించడం చాలా చాలా కష్టం.
ఇదిలా వుంటే, తాజాగా దేశంలో 8వ కరోనా మరణం నమోదయ్యింది. కోల్కతాలో ఓ వ్యక్తి కరోనా వైరస్ కారణంగా చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించారు. కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కి చేరగా, పేషెంట్ల పరిస్థితి నిలకడగా వుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6గా నమోదైన విషయం విదితమే.
853651 827212I basically could not go away your internet site prior to suggesting that I actually enjoyed the regular data an individual supply to your visitors? Is gonna be again continuously as a way to have a look at new posts 63652