Coromandel Express: ఈనెల 2వ తేదీన ఒడిశా (Odisha) లో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ (Coromandel Express) ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. భారతీయులంతా తల్లడిల్లిపోయిన ఈ ఘటనలో 275 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘటన తర్వాత అత్యంత వేగంగా స్పందించిన భారతీయ రైల్వే (Indian Railways) 51 గంటల్లోనే ఆ రూట్ లో ట్రాక్ ను నిర్మించింది. దీంతో 5రోజుల తర్వాత నేడు కోరమాండల్ మళ్లీ పట్టాలెక్కింది.
బుధవారం (7వ తేదీ) పశ్చిమ బెంగాల్ లోని షాలిమర్ నుంచి చెన్నైకి రైలు బయలుదేరింది. రైల్వే తీసుకున్న చర్యలతో బాలేశ్వర్ మార్గంలో రైళ్లు యధావిధిగా తిరుగుతున్నాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో నేడు ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒకింత భావోద్వేగానికి కూడా గురయ్యారు. వేగవంతమైన ప్రయాణానికి కోరమాండల్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. మరికొందరు ప్రమాదంపై స్పందిస్తూ.. ఇవన్నీ దైవాదీనాలని మన ప్రయాణం ఆగకూడదు కదా అంటున్నారు. మరోవైపు.. కోరమాండల్ ప్రమాదంపై కుట్ర కోణం అనుమానంతో రైల్వేతోపాటు సీబీఐ కూడా దర్యాప్తు చేస్తోంది.
Thanks for ones marvelous posting! I quite enjoyed reading it, you will be a great author.
I will ensure that I bookmark your blog and definitely will come back later on.
I want to encourage yourself to continue your great writing, have a nice day!