తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. కరోన వైరస్ ప్రభావంతో ఈ బుధవారం రాత్రి మరణించాడు. దయాకర్ రెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దయాకర్ రెడ్డి మరణం తెలంగాణ పోలీస్ శాఖలో తొలి మరణంగా నమోదైంది. దయాకర్ రెడ్డికి వైరస్ సోకిన అనంతరం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు తెలుస్తోంది. దయాకర్ రెడ్డి మరణంతో కుల్సుంపురా పోలీస్ స్టేషన్ సిబ్బందిని, అధికారులను క్వారంటైన్ కు తరలించారు.
దయాకర్ రెడ్డి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో దయాకర్ ను పురాణపూల్ సమీపంలోని చెక్ పోస్టులో పోస్టింగ్ ఇచ్చారు. లక్ డౌన్ నేపథ్యంలో ఇక్కడి కోర్టులో అత్యవసర కేసులు పరిష్కరిస్తున్నారు. దీంతో కొంతమంది సిబ్బందిని ఇక్కడి కోర్టు పరిధిలో విధులకు ఆదేశించింది పోలీస్ శాఖ. ఇక్కడకు దగ్గరలోని జియాగూడ మార్కెట్ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ కారణంగానే దయాకర్ కరోనా బారిన పడ్డాడని పోలీసులు అంటున్నారు.
67070 792548magnificent post, very informative. I wonder why the other specialists of this sector do not notice this. You ought to continue your writing. Im sure, youve a fantastic readers base already! 443818
754594 50374Hi this really is somewhat of off subject but I was wondering if blogs use WYSIWYG editors or in the event you have to manually code with HTML. Im starting a blog soon but have no coding knowledge so I wanted to get guidance from someone with experience. Any support would be greatly appreciated! 172189