భారత దేశంకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ భక్తిని కలిగించేందుకు ప్రయత్నిస్తూనే.. మరో వైపు బీజేపీ ని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సోషల్ మీడియాలో కామన్ డీపీ గా మూడు రంగుల జెండాను పెట్టుకోవాలంటూ పిలుపునిచ్చాడు.
సాదారణంగా అయితే ప్రధాని మోడీ పిలుపును కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోదు. కాని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మోడీ పిలుపునిచ్చిన కారణంగా ఆయన పిలుపును స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు కూడా త్రివర్ణం ను డీపీ గా పెట్టారు. అయితే ఆ త్రివర్ణ పతాకంను భారత ప్రధమ ప్రధాని నెహ్రూ పట్టుకుని ఉన్న ఫోటోను డీపీ గా పెట్టారు. భారత దేశంకు స్వాతంత్య్రం సాధించడం లో కాంగ్రెస్ పాత్ర కీలకం అనే విషయాన్ని దీని ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
876165 132853Properly, that is fantastic, but consider further options weve got here? Could you mind submitting an additional article relating to them also? Numerous thanks! 557286
708311 566958I favored than you may be now. 113683