ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కి పెంచుతామని ఆమధ్య సీఎం జగన్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిటీ ఏర్పాటు చేసింది. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ వేసింది. వచ్చే మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమీటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ పైనాన్స్ సెక్రటరీలు కలిపి ఆరుగురు సభ్యులు ఉంటారు. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల బౌగోళిక పరిస్థితులు, అక్కడి మౌలిక సదుపాయాలపై ఈ కమిటీ పూర్తి అధ్యయనం చేయనుంది.
272010 908071I dugg some of you post as I thought they were quite beneficial invaluable 630613
765300 361973Hey! Very good stuff, please maintain us posted when you post something like that! 358738