Switch to English

‘కమిటీ కుర్రాళ్ళు’: 40 శాతం చూడరు, 60 శాతం చూసేస్తారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,952FansLike
57,764FollowersFollow

వైసీపీ హయాంలో వైసీపీకి 50 శాతం ఓటు బ్యాంకు వుండేది గనుక, వైసీపీని వ్యతిరేకించే సినీ ప్రముఖుల సినిమాల్ని ఆంధ్ర ప్రదేశ్‌లో ఆ యాభై శాతం మంది చూడరు.! ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోయినా, వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు వుంది గనుక, ఆ నలభై శాతం మంది, ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాని చూడరట.!

పాత్రికేయం ముసుగులో ఉన్మాదాన్ని నరనరానా జీర్ణించుకునప్పుడే ఇలాంటి నీఛ నికృష్ట రాతలు పుట్టుకొస్తాయేమో.? ఏమాత్రం ఇంగితం లేకుండా, ‘పాత్రికేయం’ పేరుతో చెత్తనంతా పోగేసి పాఠకుల మీదకు వదిలే వ్యవహారాన్ని ఏమనాలి.?

నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా మీద నీలి కూలి మీడియా విషం చిమ్ముతోంది. కారణం నిహారిక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అన్న కూతురు కావడమే. సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ‘పదకొండు’ నెంబర్ చుట్టూ హైపర్ ఆది ఓ సెటైరికల్ కామెంట్ చేశాడు.

‘మా చరణ్ అన్న నటించిన సినిమాకి ఆస్కార్ వచ్చింది.. మా బాబాయ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు.. అలా మా కుటుంబానికి అన్నీ కలిసొచ్చాయ్.. నా సినిమా కూడా హిట్టయిపోవాలి..’ అని నిహారిక ఆకాంక్షించింది ఆ సినిమా ఫంక్షన్‌లో.

అంతే, వైసీపీకి ఒళ్ళు మండిపోయింది. వైసీపీ సంగతేమోగానీ, నీలి కూలి మీడియాకి అస్సలు ఈ వ్యాఖ్యలు మింగుడు పడలేదు. నలభై శాతం ఓటు బ్యాంకు వుంది కాబట్టి, ఆ ఓటు బ్యాంకుని కూడా దృష్టిలో పెట్టుకుని సినీ జనాలు మాట్లాడాలంటూ లిల్లీ పుట్ హెచ్చరికలు జారీ చేసేస్తోంది నీలి కూలి మీడియా.

నలభై శాతం మంది ఆ సినిమాని వ్యతిరేకిస్తే, మిగిలిన అరవై శాతం మంది ఆ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని హిట్ చేసేస్తారా.? ఏంటి.? వైసీపీ హయాంలో వైసీపీ తీసుకున్న ‘యాత్ర-2’ సినిమా హిట్టయిపోయిందా.? రామ్ గోపాల్ వర్మతో వైసీపీ తీయించుకున్న సినిమాలు బాగా ఆడేశాయా.?

పావలా కూలీకి పది రూపాయల పని చేస్తున్న నీలి కూలి మీడియా కష్టాలు.. నవ్వులపాలవుతున్నాయ్.!

సినిమా

ఆసక్తి హద్దులు దాటితే… థ్రిల్‌తో కట్టిపడేసిన ‘నయనం’ ట్రైలర్

వైవిధ్యమైన కథలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తూ ముందుకు సాగుతున్న జీ5, మరో కొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి సిద్ధమైంది. డిసెంబర్ 19 నుంచి...

త్రీ రోజెస్ 2లో మరింత ఎంటర్‌టైన్‌మెంట్: ఈషా రెబ్బా, హర్ష చెముడు

ఆహా ఓరిజినల్స్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన “త్రీ రోజెస్” వెబ్ సిరీస్ సీజన్ 2 ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. ఈషా రెబ్బా,...

సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ చర్చలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సినీ ప్రముఖులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం సానుకూల వాతావరణంలో సాగింది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి...

BIGG BOSS 9 TELUGU E94: కప్పు గెలిస్తే ముందుగా ...

బిగ్ బాస్ సీజన్ 9 మంగళవారం ప్రసారమైన 94వ ఎపిసోడ్ ప్రేక్షకులను స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేసింది. హౌస్‌లో డ్రామా, ఆర్గ్యుమెంట్లు, స్ట్రాటజీలు, ఎమోషన్లు— అన్నీ ఉన్నాయి....

అఖండ 2 రిలీజ్ డేట్ ఫైనల్: డిసెంబర్ 12నే తాండవం, ప్రీమియర్లు...

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2:...

రాజకీయం

రెండు దశాబ్దాల రోడ్డు కష్టాలను పరిష్కరించిన పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై చూపుతున్న స్పందన మరోసారి కనిపించింది. ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటనలో ప్రజలు వివరించిన రోడ్డు సమస్యలను వెంటనే పరిశీలించిన ఆయన, రెండు కీలక రోడ్ల...

ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ యూనివర్సిటీకి ఓపెన్‌ఏఐ సహకారం కోరిన మంత్రి లోకేష్

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి ముఖ్యమైన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ను కృత్రిమ మేధస్సు (AI) వినియోగంలో...

అమరావతి క్రియేటర్ ల్యాండ్‌కు కాన్వా సహకారం – లోకేష్ కీలక చర్చలు

శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా): అమరావతిని జ్ఞాన, సృజనాత్మకత, డిజిటల్ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే యత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్,...

అమరావతిలో క్వాంటమ్ రీసెర్చ్ హబ్‌కు రిగెట్టి సహకారం కోరిన లోకేష్

అమరావతిని అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్‌ను ఆయన...

ఆంధ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం: డల్లాస్‌లో లోకేష్ హామీ

అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రవాసాంధ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆంధ్రుల కోసం ప్రభుత్వం మరింత బాధ్యతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలాల్లో ప్రవాసాంధ్రులు...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ 9లో షాకింగ్ ట్విస్ట్: రీతూ చౌదరి ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిజంగా ప్రేక్షకులను కుర్చీ అంచులకు చేర్చే షాక్ ఇచ్చింది. అందరి ఊహలకు పూర్తిగా విరుద్ధంగా, యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించిన రీతూ చౌదరి ఎలిమినేట్...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల షాక్!

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నట్లు  వారు తెలిపారు....

రాయలసీమ ‘రాతన’లో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  నూతన విగ్రహావిష్కరణ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ,...

ఇంకా తేలని అఖండ2 అప్పుల వ్యవహారం!

అఖండ2 కోసం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నా, ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎదురవుతున్న సమస్యలు మాత్రం ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికే అనుకోని పరిస్థితుల మధ్య వాయిదా పడిన ఈ మూవీ,...

ఇండిగో రద్దుల కలకలం: వేల మంది ప్రయాణీకులు ఇబ్బందుల్లో

దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో భారీ రద్దులు, ఆలస్యాలతో విమాన ప్రయాణాన్ని పూర్తిగా గందరగోళానికి గురిచేసింది. కొత్తగా అమలులోకి వచ్చిన DGCA నిబంధనలు, ముఖ్యంగా పైలట్ల డ్యూటీ గంటలు, రాత్రి విమానాలపైనున్న పరిమితులు...