ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో ఎన్టీఆర్ కు ఖచ్చితంగా తీసుకు రావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా మరోసారి ఈ చర్చ మొదలు అయ్యింది.
కృష్ణా జిల్లా వినాయక నిమజ్జనం సందర్బంగా మరోసారి ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు మొదలు అయ్యాయి. జెండాలపై సీఎం ఎన్టీఆర్ అంటూ ముద్రించి తదుపరి సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గంలో కూడా ఎన్టీఆర్ ప్రచారం చేయాలని వారు డిమాండ్ చేశారు. మొత్తానికి ఎన్టీఆర్ ను తెలుగు దేశం పార్టీలోకి ఆహ్వానించాల్సిందే అంటూ డిమాండ్ వినిపిస్తుంది.
157413 344363This web site is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will certainly discover it. 175785