తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయంను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తంచ ఏశాడు. వచ్చిన ప్రతి సారి ఏదో ఒక వంక చెబుతూ పనులు ఆలస్యం చేస్తున్నారు. ఇలా అయితే ఏమాత్రం సహించేది లేదు. కాంట్రాక్టర్స్ ను మార్చి కొత్త వారికి అయినా పనులు అప్పగించండి. అంతే తప్ప మళ్లీ మళ్లీ ఏదో ఒక వంక చెప్పి పనులు ఆలస్యం చేస్తే బాగుండదు అంటూ అధికారులను ఆదేశించారు.
ఇకపై జాప్యంను సహించేది లేదంటూ అధికారులను సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ ఒకేసారి 20 లక్షల మంది వచ్చినా కూడా సదుపాయాలు సరిపోయే విధంగా ఉండాలంటూ సూచించాడు. రింగ్ రోడ్డు లోపల ఏ ఒక్క ప్రైవేట్ ఆస్తి కాని వ్యాపారం కాని ఉండవద్దు అంటూ సూచించాడు. కొండ కింద భూ సేకరణ పూర్తి అయ్యి.. రోడ్డు విస్తరణ పనులు మౌళిక వసతులు కల్పించాలంటూ ఆదేశించారు. ఆ తర్వాత ప్రత్యేక దర్శనం చేసుకున్న కేసీఆర్ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.
985543 832545Only a smiling visitant here to share the adore (:, btw great design and style . 438972
693946 541226I dugg some of you post as I thought they were handy quite valuable 520853