ఈనెలలో ఇప్పటికే ఒక సారి ఢిల్లీకి వెళ్లి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మరోసారి ఢిల్లీ ప్రయాణం అయ్యారు. ఒక నెలలో రెండు సార్లు ఢిల్లీకి వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంది. సీఎం కేసీఆర్ ఈనెలలోనే రెండు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో చర్చ జరుగుతోంది. అమిత్ షా నిర్వహించబోతున్న ఒక సమీక్ష సమావేశంలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం కేసీఆర్ కలుస్తారనే వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రంలో ఒక వైపు బీజేపీతో పోటా పోటీ అన్నట్లుగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రం లో మాత్రం బీజేపీతో సన్నిహితంగా ఉన్నట్లుగానే ఉంటున్నాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటన గురించిన వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ చిన్న విషయానికి పెద్ద విషయానికి వెళ్లి బీజేపీ నాయకులతో చర్చిస్తున్నారు. కనుక ముందు ముందు బీజేపీతో టీఆర్ఎస్ జోడీ కట్టే అవకాశాలు లేక పోలేదు అంటున్నారు. మొత్తానికి తెలుగు సీఎంలు ఇద్దరు కూడా ఢిల్లీ లో బీజేపీ బాస్ లకు సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది టాక్.