సీఎం కేసీఆర్ సోదరి తరపు సమీప బంధువులు అయిన ప్రవీణ్, నవీన్, సునీల్ లు కిడ్నాప్ అయ్యారు అంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఎంక్వౌరీ మొదలు పెట్టారు. దాంతో వికారాబాద్ లో ఆ ముగ్గురిని కిడ్నాపర్స్ వదిలి పెట్టి పారిపోయినట్లుగా తెలుస్తోంది.
ఆ ముగ్గురు క్షేమంగా ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక ల్యాండ్ విషయమై వారిని కిడ్నాప్ చేసి ఉంటారు అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ కాబడ్డ ముగ్గురు కూడా కేసీఆర్ పీఏ వేణుగోపాల్ రావు కు బావమరుదులు అవుతారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో వారి ఇంటికి వెళ్లి ఐటీ అధికారులం అంటూ చెప్పి కిడ్నాపర్స్ ప్రవీన్, నవీన్, సునీల్ లను వెంటబెట్టుకు వెళ్లారు. వెంటనే విషయం పోలీసులకు తెలియజేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. కే
సుతో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భార్గవ్ రామ్ తమ్ముడు చంద్రహాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
368230 472379I got what you mean ,bookmarked , extremely nice internet website . 787665