కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మొగిలయ్య కళను గుర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతోపాటు నిర్మాణ ఖర్చు, ఇతర ఖర్చుల కోసం కోటి రూపాయల నగదును ప్రకటించారు. ఈమేరకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసిన మొగిలయ్యను సీఎం కేసీఆర్ శాలువాతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడని సీఎం కొనియాడారు.
మొగిలయ్య మెట్ల కిన్నెర సంగీతవాయిద్య పరికరాన్ని వాయిస్తూ జానపదకళకు ప్రాణం పోస్తున్నారు. ఆయన కళను గుర్తించిన పవర్ స్తార్ పవన్ కల్యాణ్ తన భీమ్లా నాయక్ సినిమాలో ఆయన చేత పాట పాడించి ఆయనపైనే కొన్ని చరణాలను చిత్రీకరించారు. దీంతో ఆయన పేరు పాపులర్ అయింది. మొగిలయ్య కళ వెలుగులోకి వచ్చింది. పవన్ కల్యాణ్ ఆయన్ను సత్కరించి గతంలో 2లక్షల రూపాయల బహుమతి కూడా అందజేశారు.
802223 980772What a lovely weblog. I will certainly be back. Please maintain writing! 483322
thank a lot for your internet site it helps a great deal. [url=http://xn--2q1b16pbvaa76zkso.com/bbs/board.php?bo_table=free&wr_id=184102]puoi trovare plaquenil senza prescrizione medica a Napoli[/url]