రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్దనున్న గోశాలలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టుతో హాజరైన సంక్రాంతి సంబరాలను తిలకించారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోవులకు ప్రత్యేక పూజలు భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెల్లకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ పండుగ శుభాకాంక్షలు’ అని అన్నారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
440803 986405i was just browsing along and came upon your web site. just wantd to say great job and this post really helped me. 119953
909002 54574conclusion that you are totally appropriate but a couple of call for to be 641178