ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,310FansLike
57,764FollowersFollow

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ వర్గాలకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆర్థికశాఖ స్థితిగతులపై చంద్రబాబు నాయుడు పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు జీపిఎఫ్, సరెండర్ లీవులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కలిపి మొత్తం రూ. 1300 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా ఉద్యోగులకు రూ. 519 కోట్లు జీపిఎఫ్ విడుదల చేయనుఉన్నారు.

పోలీస్ డిపార్టుమెంట్ కు సంబంధించి సరెండర్ లీవులకు గాను రూ.214 కోట్ల విడుదల చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నిధులతో 54 వేల 900 మంది పోలీసులకు మేలు జరగబోతోంది. వీటితో పాటు రూ. 300 కోట్ల ఒక నెల సిపిఎస్ కంట్రిబ్యూషన్ కూడా విడుదల చేశారు. సిఎస్ఎస్ స్కీమ్స్ కు రూ. 627 కోట్లు, టిడిఎస్ చెల్లింపులు రూ. 265 కోట్లు చెల్లించాలిన ఆదేశించారు. వీటితో పాటు ఏపీకి గుండెకాయ లాంటి అమరావతి రాజధానికి, గన్నవరం ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు రూ.244 కోట్లు కౌలు చెల్లింపు కింద విడుదల చేశారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు రూ.400 కోట్లు, డ్రగ్స్, మెడిసిన్స్ కోసం రూ.100 కోట్లు చెల్లించారు. అలాగే విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కింద రూ.788 కోట్లు విడుదల చేశారు.

ఈ నిధులతో 6.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరబోతోంది. కాంట్రాక్టర్ల బిల్లులు రూ.10 లక్షల లోపు ఉన్న అన్నింటినీ రిలీజ్ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వీటి కోసం రూ.506 కోట్లు విడుదల చేయాలన్నారు. దీంతో గత ఐదేండ్లుగా ఇబ్బందులు పడుతున్న 26,000 వేల మందికి లబ్ది చేకూరుతోంది. వీటితో ఎంఎస్ఎంఈ కింద రూ. 90 కోట్లు విడుదల చేస్తామన్నారు. దాంతో 651 కంపెనీలతో పాటు 6651 మందికి లబ్ది జరుగుతోంది. దీంతో పాటు విద్యుత్ శాఖ్ డిస్కంలకు రూ. 500 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న నిర్వహణా బిల్లులు రూ.366 కోట్లు కూడా సంక్రాంతి కానుకగా చెల్లించాలన్నారు.

అలాగే పెండింగ్ లో ఉన్న మరి కొన్ని బిల్లులు, బకాయిలు కూడా విడుదల చేస్తామన్నారు. ఇలా అన్ని బిల్లులు కలిపి రూ. 6700 కోట్లు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ పూర్తి నిధులు రేపటి నుంచే లబ్దిదారుల అకౌంట్లలో జమ అవుతాయి. సంక్రాంతి సందర్భంగా ఇంతటి భారీ కానుక ఇవ్వడంతో ఆయా లబ్దిదారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

సినిమా

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘జెట్లీ’ని ఆపారు.. ‘పెద్ది’ని కూడా ఆపుతారా..? నిర్మాత ఏమంటున్నారు..?

Tollywood: ప్రేక్షకులకు వినోదం అందించాలంటే చిత్రం ప్రదర్శన కావాలి. ప్రేక్షకాదరణకు నోచుకోవాలంటే ప్రదర్శన జరగాలి. అసలు దర్శక-నిర్మాతలు తీసే సినిమా ప్రదర్శన కావాలంటే ఉండాల్సింది ధియేటర్లు. అక్కడ ప్రదర్శన జరిగితేనే అంతిమ ఫలితాలు,...

RC17పై సుకుమార్ ఫోకస్.. ఫస్ట్ హాఫ్ లాక్!

దర్శకుడు Sukumar మరియు మెగా పవర్ స్టార్ Ram Charan కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #RC17 సినిమాపై తాజా అప్డేట్ ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ హాఫ్ ఇప్పటికే లాక్ చేసినట్లు...

“శ్రమజీవులే దేశానికి బలం” – ప్రేమ్ కుమార్: మే డే వేడుకలు ఘనంగా

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా శ్రమజీవుల సేవలకు గౌరవం తెలియజేస్తూ మోతీనగర్‌లోని ఎస్బీఐ భవనం ఎదురుగా ఉన్న ఈ-సేవ కార్యాలయం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు దుట్టా...

“స్వచ్ఛరథాలు దూసుకుపోతున్నాయ్”: గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పారిశుధ్యానికి కొత్త దిశగా స్వచ్ఛరథాలు వేగంగా మార్పులు తీసుకొస్తున్నాయి. “మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత” అనే భావనతో గౌరవ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఆలోచనల నుంచి ప్రారంభమైన...

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...