సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా పెద్ద తెర మీదే కాదు బుల్లి తెర మీద కూడా సంచలనం సృష్టించింది. మొన్న పండక్కి ఈ చిత్రాన్ని టివిలో ప్రదర్శిస్తే అత్యధిక టిఆర్పి సాధించిన తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత బ్రేక్ తీసుకున్న మహేష్ కు లాక్ డౌన్ కారణంగా అది ఇంకా పొడిగించినట్లైంది. అయితే తన తర్వాతి సినిమా విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీకి ఒచ్చేసాడు. ముందు వంశీ పైడిపల్లితో అనుకున్నా కానీ పరశురామ్ తో ముందుకెళదామనే డిసైడ్ అయినట్లు కన్ఫర్మ్ అయింది.
అయితే గత కొన్ని రోజుల నుండి ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్ లేదా కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తారని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని సమాచారం. ఇంకా హీరోయిన్ గురించి ఎటువంటి చర్చా జరగలేదని, నిర్మాతలుగా ఎవరు ఉండాలి, ఎవరి వాటా ఎంత అనే అంశాల దగ్గరే ఇంకా చర్చలు ఉన్నాయని తెలుస్తోంది.
ఎందుకంటే పరశురామ్ కు 14 రీల్స్ ప్లస్ ఇంకా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ల వద్ద కమిట్మెంట్లు ఉన్నాయి. మహేష్ ఏమో దిల్ రాజుకు కమిట్ అయ్యాడు. ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తే కానీ హీరోయిన్ దాకా వెళ్ళరు. అదీ సంగతి.
285621 311043Sounds like some thing a lot of baby boomers really should study. The feelings of neglect are there in a lot of levels when a single is over the hill. 64091