హీరో నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్ చేసారు. ‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. తను త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్తతలు. నువ్వు దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను.. డియర్ తారకరత్న’ అని ట్వీట్ చేశారు.
తారకరత్న కోలుకోవాలని ప్రముఖులు, నందమూరి అభిమానులు, నెటిజన్లు కూడా కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇటివల లోకేశ్ పాదయాత్ర ప్రారంభంలో తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని.. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు ప్రకటించారు. బాలకృష్ణతోపాటు నందమూరి కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా బెంగళూరు వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే.
సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి
ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.May you have a long and healthy life dear Tarakaratna!
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023
830923 981584Hello, Neat post. There is actually a difficulty along with your web site in internet explorer, could test thisK IE nonetheless will be the marketplace leader and a large portion of folks will leave out your outstanding writing due to this problem. 691096
50295 447681To know wisdom and instruction, to perceive the words of understanding 591245