మెగాస్టార్ చిరంజీవి ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాఖీ పౌర్ణమికి తన చెల్లెల్లతో రాఖీ కట్టించుకున్నాడు. టాలీవుడ్ ఎంతో మంది స్టార్స్ రాఖీ పండుగ సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే చిరంజీవి ప్రతి సంవత్సరం చెల్లెల్లతో చేసుకునే రాఖీ పండుగను అభిమానులు మరియు జనాలు చూడాలని కోరుకుంటారు. ఈ ఏడాది కూడా చెల్లెల్లు ఇద్దరు కూడా రాఖీ కట్టి అన్న చిరంజీవి వద్ద ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు బహుమానాలు కూడా అందుకున్నారు.
ఈ సందర్బంగా నా చెల్లెళ్లిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడుచులతో అన్నయ్య అని పిలిపంచుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ లో చిరంజీవి షేర్ చేశారు. చిరంజీవి చెల్లెల్లు రాఖీ కట్టిన వెంటనే వారికి ఇచ్చిన బహుమానాల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వారిద్దరికి ఇచ్చిన ఆ బహుమానం ఏంటో అంటూ అంతా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు బహుమానం గురించి కాదు కాని ఈ వయసులో కూడా ఇంకా ఎంతో ఆప్యాయతగా అన్యోన్యంగా అన్న చెల్లెల్లు రాఖీ పండుగ జరుపుకోవడం నిజంగా గొప్ప విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#MegastarChiranjeevi celebrated #Rakshabandhan with his sisters at home, and has wished all the women of the Telugu states a #HappyRakshaBandhan#RakshaBandhan2020 #Chiranjeevi @KChiruTweets @IamSaiDharamTej pic.twitter.com/rz83PfI4i8
— TeluguBulletin.com (@TeluguBulletin) August 3, 2020
613289 837014To know wisdom and instruction, to perceive the words of understanding 641703