Chiranjeevi: ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినిమా భీష్మాచార్యుడిగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సింగ్ గీతం’. మరో స్టార్ డైరక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 12న సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా హిట్టవ్వాలని కోరుకుంటూ మెగాస్టార్ చిరీంజివి ఆకాంక్షించారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘”శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు”.. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈనెల 12వ తేదీన “#SingGeetham” సినిమా విడుదలై, ఇండియన్ సినిమాలో మరొక మైలురాయి గా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’.
‘అలాగే, ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతంగారు, మరోవైపు నేటితరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్. స్ఫూర్తిదాయకమైన వీరిద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రానికి, నాకెంతో ఇష్టమైన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్నిస్తోంది.. ఈ సేందర్భంగా నాగ అశ్విన్ కి, స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్ తోపాటు చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
“శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు”
తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు.అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ… pic.twitter.com/tA6rvr14Il
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 11, 2026
