కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తన సినిమాల షూటింగ్స్ అన్నిటినీ హోల్డ్ లో పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఈరోజు నుండి భోళా శంకర్ షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. 12 రోజుల పాటు అక్కడే షూటింగ్ ను నిర్వహించనున్నారు.
ఈ షెడ్యూల్ లో చిరంజీవి, కీర్తి సురేష్ తో పాటు ఇతర ప్రముఖులు కూడా షూటింగ్ లో పాల్గొంటారు. తమిళ హిట్ చిత్రం వేదలమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తోంది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. చిరంజీవి ఆచార్య చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానుండగా గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరిలో తిరిగి మొదలుపెట్టనున్నాడు. ఇవన్నీ కాకుండా బాబీ దర్శకత్వంలో కూడా షూటింగ్ ను మొదలుపెట్టాడు.