జీవితం రెప్పపాటులో తలకిందులు అవుతుంది అనడానికి మరో ఉదాహరణ. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మృత్యు ఒడికి చేరుకోవడంతో వారి కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది. ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చిరంజీవి అభిమానులతో పాటు అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్ లోని పీఎంపాలెం సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మధురవాడ నగరంపాలెంకు చెందిన యడ్ల లక్ష్మణ్ యాదవ్ (52) ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రోజూ లానే విధులు ముగించుకుని ఇంటికి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. విశాఖ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ కొమ్మాది కూడలిలో రెడ్ సిగ్నల్ పడటంతో తన వాహనాన్ని సడెన్ గా ఆపేసాడు.
దీంతో వెనక నుండి వేగంగా వస్తోన్న లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఎగిరి రోడ్డుపై పడి, తలకి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, జనసేన నాయకులు, కార్యకర్తలు దిగ్బ్రాంతికి లోనయ్యారు.
520002 515844The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a whole lot as this 1. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear is a bunch of whining about something that you possibly can repair really should you werent too busy on the lookout for attention. 786477
892554 928956Ive read several good stuff here. Certainly value bookmarking for revisiting. I surprise how considerably effort you put to create 1 of these excellent informative site. 828677