పొరుగుదేశం జిత్తులమారి చైనా తన కుతంత్రాలు ఆపడంలేదు. సరిహద్దుల్లో తన విస్తరణ కాంక్షను ఏదో ఒక విధంగా చూపిస్తూనే ఉంది. తాజాగా భారత సరిహద్దుల వరకు బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. తన బలగాలనే వేగంగా సరిహద్దులకు తరలించేందుకు ఎప్పటినుంచో కార్యాచరణ సిద్ధం చేసుకున్న డ్రాగన్ దేశం.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్ రైలు ప్రారంభించింది. టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్ చి ప్రాంతం వరకు ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ రైలు సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 435.5 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను 2014లోనే చైనా ప్రారంభించింది.
ఈ బుల్లెట్ రైలుతో సిచువాన్ ప్రావిన్సు రాజధాని చెంగ్డు నుంచి లాసా మధ్య ప్రయాణ దూరం 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గుతుంది. సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఈ రైల్వే లైన్ కీలకపాత్ర పోషిస్తుందంటూ గతేడాది చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ వ్యాఖ్యానించడం చైనా కాంక్షను తెలియజేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు నింగ్ చి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి వరకు బుల్లెట్ రైలు వేయడం వెనుక చైనా వ్యూహం ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని అంటున్నారు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ లో భాగమంటూ చైనా వితండవాదన చేస్తున్న సంగతి తెలిసిందే.
566385 843827You created some excellent points there. I did a search on the subject and identified a lot of people will agree along with your blog. 542550
133938 557036Pretty section of content. I just stumbled upon your web site and in accession capital to assert that I get in fact enjoyed account your blog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you access consistently quick. 280229
372231 230634I was looking at some of your blog posts on this web site and I believe this web internet site is real instructive! Keep posting . 286490