తల్లిదండ్రులకు ఆర్ధికంగా అండగా నిలుద్దామని ఆలోచించింది ఓ మహిళ. ఇందుకు తాను చేస్తున్న పనితో మరింత నష్టపోతున్ననని గ్రహించలేదు. సదరు మహిళ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోయిన ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో మహిళ తన బంగారాన్నంతా పోగొట్టుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని మాదలపాళ్యకు చెందిన మహిళ ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. లాక్ డౌన్ పరిస్థితుల్లో ఆర్ధికంగా ఇబ్బందులు పడింది. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలంటే డబ్బు అవసరమని తన కిడ్నీ అమ్మేందుకు సిద్ధపడింది. వచ్చే డబ్బుతో తల్లిదండ్రులకు సాయపడాలని భావించింది. ఫేస్ బుక్ లో ఇందుకు సంబంధించిన యాడ్ చూసింది. వెంటనే ఆ యాడ్ లోని నెంబరులో కాంటాక్ట్ అవగా అవతలి వ్యక్తి తనను తాను హదాఫాంగ్ గా పరిచయం చేసుకున్నాడు.
మాటల్లో కిడ్నీ దానం చేయాలంటే డోనర్ కార్డు ఉంటేనే చట్టబద్ధంగా సాధ్యమని చెప్పాడు. కార్డు కోసం టాక్స్ ఐడెంటిఫికేషన్ ఫీజు, పోలీస్ అనుమతుల కోసం కొంత డబ్బు అవసరమవుతుందని నమ్మబలికాడు. ఇందుకు అవసరమైన డబ్బును తన అకౌంట్ వేయాలని కోరాడు. ఇదంతా నమ్మి ఆ మహిళ తన బంగారు నగలను తాకట్టు పెట్టి రూ.3లక్షలు అతని ఖాతలో జమ చేసింది. దీని తర్వాత ఆ మహిళ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటువైపు నుంచి స్పందన లేదు.
దీంతో ఆమెకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అది సైబర్ నేరంగా గుర్తించారు. డబ్బును నేరగాడు వెంటనే విత్ డ్రా చేశాడని గుర్తించారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు.
912245 715224Thanks for the information provided! I was researching for this article for a long time, but I was not able to see a dependable source. 659992
497397 991818Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You obviously know what youre talking about, why throw away your intelligence on just posting videos to your blog when you could be giving us something informative to read? 244275
727798 798719You produced some decent points there. I looked on the internet for that issue and located most individuals will go together with with the site. 760115