“అభివృద్ధి అంటే చంద్రబాబు”: యూరప్ వేదికపై లోకేష్ స్పష్టమైన సందేశం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,231FansLike
57,764FollowersFollow

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వేదికగా జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేనని స్పష్టం చేస్తూ, ఆయన విజన్‌ను అమలు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల నేపథ్యంలో జ్యూరిక్‌కు వచ్చిన లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రసంగించారు. యూరప్‌లోని సుమారు 20 దేశాల నుంచి వచ్చిన తెలుగువారి ఉత్సాహాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు.

తెలుగువారు ఎక్కడ ఉన్నా తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారని ప్రశంసించిన లోకేష్, విదేశాల్లో ఉన్న తెలుగు సమాజం రాష్ట్రాభివృద్ధికి కీలక భాగస్వాములని పేర్కొన్నారు. గత ఏడాది ఇదే వేదికపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానం ప్రారంభమైందని, అక్కడినుంచే పెట్టుబడుల వెల్లువ మొదలైందని గుర్తుచేశారు. గత 18 నెలల్లో రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని, వాటితో 16 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రావడం రాష్ట్రంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటిచెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన వేసిన బాటలోనే చంద్రబాబు నాయుడు అభివృద్ధి రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారని లోకేష్ చెప్పారు. ఐటీ నుంచి క్వాంటమ్ టెక్నాలజీ వరకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దూరదృష్టి చంద్రబాబుకే ఉందన్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు ఏపీకి రావడానికి కారణం ఒక్కటే – “బ్రాండ్ సీబీఎన్” అని స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడిని చూసి బ్లైండ్‌గా ఫాలో కావాలని వ్యాఖ్యానించిన లోకేష్, ఆయన ముందుచూపుపై నమ్మకంతోనే పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని తెలిపారు. విమర్శలు ఎదురైనా భోగాపురం ఎయిర్‌పోర్టు, అమరావతి అభివృద్ధి, హైటెక్ సిటీ వంటి ఎన్నో ప్రాజెక్టులు ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దని ప్రయత్నించే శక్తులు ఉన్నా, వాటిని అధిగమించి ఏపీని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఏపీ భవిష్యత్తును నిర్మిస్తున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ, రైల్వే జోన్, అమరావతి పునర్నిర్మాణం, పోలవరం పనుల వేగవంతం వంటి కీలక అంశాల్లో పురోగతి కనిపిస్తోందన్నారు.

అభివృద్ధి, సంక్షేమం రెండూ ఒకే రథచక్రాల్లా ముందుకు సాగుతున్నాయని, రోడ్లు, మౌలిక వసతులు, విద్యుత్ చార్జీల తగ్గింపు, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం ఫలితాలు చూపుతోందన్నారు. ఒకే రాజధాని అమరావతి, వికేంద్రీకృత అభివృద్ధే ప్రభుత్వ విధానమని స్పష్టం చేస్తూ, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్న లోకేష్, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంలో వారి పాత్ర కీలకమన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏపీఎన్ఆర్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ పెంచాలని కోరారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్, మంత్రి టీజీ భరత్, ఏపీఎన్ఆర్టీ చైర్మన్ డాక్టర్ వేమూరు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్....

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన...

రాజకీయం

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త ప్రసాద్‌ను పరామర్శించారు. అల్లాపూర్‌కు చెందిన ప్రసాద్ గత రెండు రోజులుగా న్యూరో సంబంధిత ఆరోగ్య...

E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలన ప్రశ్నలు.. పాత వాహనాలకు నిజంగా సేఫేనా?

దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ మిశ్రమం) పెట్రోల్ అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా E20...

ఎక్కువ చదివినవి

జస్ట్ ఆస్కింగ్: జోసెఫ్ రావణ్‌కీ ప్రకాష్ రాజ్‌కీ ‘లింక్’ ఏంటి.?

యూ ట్యూబర్ జోసెఫ్ రావణ్ ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో వున్నాడు. నాలుగు సార్లు అరెస్ట్.. నాలుగు సార్లూ బెయిల్.. ఐదో సారి మాత్రం, బలమైన చట్టాల...

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

Jana Nayagan: ‘జననాయగన్ కు తప్పని ఇబ్బందులు..’ ఆన్ లైన్లో ఎంతమంది చూశారో తెలుసా..?

Jana Nayagan: తమిళ అగ్ర హీరో, సీఎం విజయ్ నటించిన సినిమా ‘జననాయగన్’. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందే నటించిన చివరి సినిమాగా జననాయగన్ ప్రచారం జరిగింది. సినిమా షూటింగ్ గతేడాదే పూర్తయినా...

ఉద్యోగాల కోసం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఎదగండి: లోకేష్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన జాతీయ విద్యా విధానం, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్–2047 వంటి కార్యక్రమాలు దేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తున్నాయని, అదే స్ఫూర్తితో...

Daily Horoscope: మకరం వారికి ఉద్యోగ పురోగతి.. మీనం వారికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త

జులై 6 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈ రోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్యకు ఉపయోగపడే సూచనలను అందిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు...