తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజా చైతన్య యాత్ర చేపట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సర్కార్ అరాచక పాలనపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ యాత్ర చేపట్టబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న విషయం విదితమే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఏడాది సమయం అయినా ఇవ్వకుండా, ప్రధాన ప్రతిపక్షం ఇలాంటి యాత్రలు చేపడితే, వాటికి ప్రజల నుంచి ఆశీస్సులు వుంటాయా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.
అయితే, రాష్ట్రంలో ప్రజలు రకరకాల సమస్యలతో సతమతమవుతునన మాట వాస్తవం. ఆ సమస్యలన్నిటికీ చంద్రబాబు పాలనే నిదర్శనమని వైఎస్సార్సీపీ ఆరోపిస్తూ వస్తోంది. అభివృద్ధి ఆలోచనల్ని పక్కన పెట్టేసి, సంక్షేమం పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోన్న మాట వాస్తవం. చంద్రబాబు పాలనను మరిపించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం దూసుకుపోతోంది అప్పుల విషయంలో. అప్పు చేసి పప్పుకూడు అన్న చందాన, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలువుతున్నాయన్న విమర్శలున్నాయి.
అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు గనుక.. సంక్షేమ పథకాల పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసే పబ్లిసిటీ స్టంట్లు కొంత మేర బాగానే వర్కవుట్ అవుతున్నాయి. అదే సమయంలో చరిత్రలో కనీ వినీ ఎరుగని స్థాయిలో అతి తక్కువ కాలంలోనే, అత్యంత తీవ్రమైన వ్యతిరేకతను జనం నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటోందన్నదీ నిర్వివాదాంశం.
సరిగ్గా, ఇదే తమకు కలిసొస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే, ఇప్పట్లో ఎన్నికలొచ్చే పరిస్థితి కన్పించడంలేదు ఆంధ్రప్రదేశ్లో. మరి, అలాంటప్పుడు చంద్రబాబు ‘ప్రజా చైతన్య యాత్ర’ చేస్తే ఏం ప్రయోజనం.? ఈ విషయమై టీడీపీలోనూ భిన్నాభిప్రాయాలు వున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ప్రతిపక్షంగా ప్రజల తరఫున వుండకపోతే పలచనైపోతామన్న కోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు ప్రజా చైతన్య యాత్ర విషయంలో.
అవును మరి, ఇది సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే, యాత్ర బెడిసికొడితే.. రాజకీయంగా టీడీపీ మరింత అభాసుపాలైపోయే ప్రమాదముంటుంది.
782604 533757Absolutely composed content material , thankyou for information . 391726