Switch to English

చంద్రబాబు ‘ప్రజా చైతన్య యాత్ర’.. సాధించేదెంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజా చైతన్య యాత్ర చేపట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అరాచక పాలనపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ యాత్ర చేపట్టబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న విషయం విదితమే. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఏడాది సమయం అయినా ఇవ్వకుండా, ప్రధాన ప్రతిపక్షం ఇలాంటి యాత్రలు చేపడితే, వాటికి ప్రజల నుంచి ఆశీస్సులు వుంటాయా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

అయితే, రాష్ట్రంలో ప్రజలు రకరకాల సమస్యలతో సతమతమవుతునన మాట వాస్తవం. ఆ సమస్యలన్నిటికీ చంద్రబాబు పాలనే నిదర్శనమని వైఎస్సార్సీపీ ఆరోపిస్తూ వస్తోంది. అభివృద్ధి ఆలోచనల్ని పక్కన పెట్టేసి, సంక్షేమం పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోన్న మాట వాస్తవం. చంద్రబాబు పాలనను మరిపించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దూసుకుపోతోంది అప్పుల విషయంలో. అప్పు చేసి పప్పుకూడు అన్న చందాన, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలువుతున్నాయన్న విమర్శలున్నాయి.

అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు గనుక.. సంక్షేమ పథకాల పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసే పబ్లిసిటీ స్టంట్లు కొంత మేర బాగానే వర్కవుట్‌ అవుతున్నాయి. అదే సమయంలో చరిత్రలో కనీ వినీ ఎరుగని స్థాయిలో అతి తక్కువ కాలంలోనే, అత్యంత తీవ్రమైన వ్యతిరేకతను జనం నుంచి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎదుర్కొంటోందన్నదీ నిర్వివాదాంశం.

సరిగ్గా, ఇదే తమకు కలిసొస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే, ఇప్పట్లో ఎన్నికలొచ్చే పరిస్థితి కన్పించడంలేదు ఆంధ్రప్రదేశ్‌లో. మరి, అలాంటప్పుడు చంద్రబాబు ‘ప్రజా చైతన్య యాత్ర’ చేస్తే ఏం ప్రయోజనం.? ఈ విషయమై టీడీపీలోనూ భిన్నాభిప్రాయాలు వున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ప్రతిపక్షంగా ప్రజల తరఫున వుండకపోతే పలచనైపోతామన్న కోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు ప్రజా చైతన్య యాత్ర విషయంలో.

అవును మరి, ఇది సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే, యాత్ర బెడిసికొడితే.. రాజకీయంగా టీడీపీ మరింత అభాసుపాలైపోయే ప్రమాదముంటుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...