కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ అరెస్ట్ అయ్యి గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న విషయం తెల్సిందే. ఆమెను ఇటీవలే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేశారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో అఖిల ప్రియ చాలా రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే ఆమెకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాల్ చేశాడట. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఎలాంటి ఆందోళన అక్కర్లేదు అంటూ అఖిల ప్రియకు ధైర్యం చెప్పాడట.
చంద్రబాబు నాయుడు హయాంలో అఖిల ప్రియ మంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కూడా తెలుగు దేశం పార్టీలోనే ఆమె ఉన్నారు. ఆమె కష్టంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోవడం లేదని ఆమెకు సాయంగా అండగా నిలవాల్సిన ఈ సమయంలో ఆమె గురించిన ఆలోచనే చేయడం లేదు అంటూ కొందరు విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఆమెకు కాల్ చేయడంతో అంతా కూడా సైలెంట్ అయ్యారు.
957964 174946You produced some decent points there. I looked on the net for any issue and located most individuals goes along with together along with your site. 960622