రాష్ట్రంలో ఇసుక కొరత ఎంతటి తీవ్రంగా ఉన్నదో చెప్పక్కర్లేదు. ఇసుక కొరత కారణంగా ఉపాధిలేక భవన నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరిగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇసుక రిచ్ లలో ఇసుక తవ్వడానికి అనుకూలంగా లేవని, అందుకే ఇసుక తవ్వకాలు ఆలస్యం అవుతున్నాయని ప్రభుత్వం చెప్తున్నా.. ఆ విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు. వరదలు వచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి. అలాగని అక్కడ ఎక్కడా ఇసుక అందుబాటులో లేకుండా ఉండలేదు. ప్రతి చోట ఇసుక అందుబాటులోనే ఉన్నది.
ఎక్కడా ఇలాంటి చావులు కనిపించలేదు. ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు జరిగింది.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇసుక ఎందుకు తీయడం లేదు..గత ప్రభుత్వం తప్పులు చేసింది అని ఎత్తి చూపించేందుకు వైకాపా ఇలాంటి పధకం వేసింది. కానీ, వైకాపా ప్లాన్ బెడిసి కొట్టడంతో అభాసుపాలైంది. ప్రతిపక్షాలన్నీ ఈ విషయంపై ఒక్కతాటిపైకి వచ్చి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అయితే, ఇటీవలే లోకేష్ గుంటూరులోని కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఒకరోజు ఇసుక దీక్ష చేశాడు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేసినంత మాత్రానా ప్రభుత్వం దిగివస్తుందా చెప్పండి. తిన్నది తిరగడానికి లోకేష్ బాబు దీక్ష పేరుతో అక్కడ కూర్చున్నారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇదే తప్పుడు బాబుగారు చేయబోతున్నారు. ఈనెల 14 వ తేదీన చంద్రబాబు నాయుడు ఒకరోజు ఇసుక దీక్షను చేస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో కూర్చుంటారు. అసలే బాబుగారికి షుగర్, బీపీ అన్ని ఉన్నాయి. 8 గంటలు ఏమి తినకుండా అంటే చాలా కష్టం. కానీ తప్పదు. ఎలాగో కార్తీకమాసం కదా.. దీక్ష పేరుతో 8 గంటలపాటు కామ్ గా కూర్చొని శివనామస్మరణ చేస్తే పుణ్యంతో పాటు పురుషార్థం కూడా దక్కుతుందని బాబుగారు భావిస్తున్నారు.
148453 703163They call it the self-censor, basically because you are too self-conscious of your writing, too judgmental. 427506
626787 816070Following study several of the blog posts on your own web site now, we genuinely like your way of blogging. I bookmarked it to my bookmark web internet site list and are checking back soon. Pls consider my web-site likewise and make me aware if you agree. 969838