కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు. రాయలసీమ కరువు పోగొట్టడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచుతామని సీఎం జగన్ చెప్పడంతో రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వేడి రాజుకుంది. ఈ అంశంపై ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంతవరకూ స్పందించ లేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంతవరకూ పోతిరెడ్డిపాడుపై మాట్లాడకపోవడంపై అధికార పార్టీ నుంచి విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఈరోజు ప్రారంభమైన టీడీపీ మహానాడు తొలిరోజున చంద్రబాబు ఈ అంశం గురించి నామమాత్రంగానే మాట్లాడారు.
ఎన్టీఆర్ హయాంలోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలే ముఖ్యమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను తామే 75శాతం పూర్తి చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో తాము చేపట్టిన 34 ప్రాజెక్టులను జగన్ సీఎం అయ్యాక రద్దు చేశారని అన్నారు. అధికారంలో ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా క్షేమం కోసమే తాము పని చేస్తామని అన్నారు. పోతిరెడ్డిపాడుపై ఇరు రాష్ట్రాల సీఎంలు ఇంకా పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదు. ఇరు రాష్ట్ర రాజకీయాల్లో పోతిరెడ్డిపాడు అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
323538 602545Wow that was strange. I just wrote an incredibly long comment but after I clicked submit my comment didnt appear. Grrrr properly Im not writing all that over once again. Regardless, just wanted to say amazing weblog! 236263
37719 748934hello excellent internet site i will definaely come back and see once more. 194930
401561 879230Couldn?t be produced any greater. Reading this post reminds me of my old room mate! He always kept talking about this. I will forward this report to him. Pretty certain he will possess a great read. Thanks for sharing! 860413