Switch to English

హైదరాబాద్ ను అభివృద్ధి చేసి తప్పు చేశా: చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం టైం ఏమీ బాగోలేదు. తెలంగాణలో ఎప్పుడో చాప చుట్టేసిన ఆ పార్టీ.. ఏపీలోనూ దారుణ పరాజయం పాలైంది. ఇదే అదనుగా ఆ పార్టీని నిర్వీర్యం చేసి తాను పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన టీడీపీ అధినేత బొక్కబోర్లా పడుతున్నారు. తనకు తానుగా ఇబ్బందికర వాతావరణం కొని తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసి తప్పు చేశానంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలో సొంత పార్టీలోనే కలకలం సృష్టిస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణలో పార్టీ దాదాపు కనిపించని స్థితికి చేరిపోగా.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో మరింత చేటు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు చంద్రబాబు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యతిరేకిగా బాబుపై ముద్ర పడిపోయింది. తాజా వ్యాఖ్యలతో అది మరింత ఎక్కువవుతుందని, ఇక తెలంగాణలో పార్టీ కోలుకునే పరిస్థితి ఉండదని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెబుతుంటారు.

హైటెక్ సిటీ కట్టింది తానేనని, సైబరాబాద్ నిర్మించింది కూడా తానేనని, రింగు రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం కూడా తన ఘనతే అని క్రెడిట్ తీసుకుంటుంటారు. అలాంటిది హైదరాబాద్ ను అభివృద్ధి చేసి తప్పు చేశానంటూ తాజాగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తెలంగాణ టీడీపీ నేతల్లో కలకలం రేపింది. ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు అభివృద్ధి మొత్తం అక్కడ కేంద్రీకృతమైంది. అందులో ఎలాంటి తప్పూ లేదు.

ఫలితంగా రెండు ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. విభజన తర్వాత భౌగోళికంగా తెలంగాణలో ఉన్న హైదరాబాద్ కొత్త రాష్ట్రానికి రాజధాని అయింది. ఏపీకి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నానని చంద్రబాబు వంటి సీనియర్ నేతలు వ్యాఖ్యానించడం సరికాదని అంటున్నారు. అది తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్దంగా మాట్లాడటమే అని పేర్కొంటున్నారు. తనకు, పార్టీకి నష్టం కలిగించే ఈ వ్యాఖ్యలపై బాబు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...