Switch to English

చంద్రబాబు మార్క్.. అమరావతిలో భూములిస్తామంటూ నిరసన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

ఏపీ రాజధాని అమరావతి మళ్లీ నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. గత ఐదేళ్లు అసలు అమరావతి ఊసే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు మళ్లీ తన మార్క్ చూపిస్తుండటంతో.. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఐదేళ్లలో ప్రాజెక్టులు అమరావతికే రాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేష్ ఆయా సంస్థలను కలిసి అమరావతికి రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. దావోస్ పర్యటన తర్వాత అమరావతికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. దీంతో మొన్నట వరకు లోన్లే ఇవ్వం అని చెప్పిన ఎస్బీఐ, యానిమల్ బ్యాంకులు కూడా అభివృద్ధిని చూసి లోన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.

ఇంకో వైపు కేంద్రం కూడా భారీగా సాయం చేస్తోంది. ఇప్పటికే సెంట్రల్ బడ్జెట్ లో వేల కోట్లు కేటాయించింది. త్వరలోనే రైలు, రోడ్డు మార్గాలను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతోంది. ఇలా ఏపీ రాజధాని కోసం అందరూ సహకరిస్తుండటంతో రైతుల్లో నమ్మకం పెరిగింది. అమరావతి కోసం ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ భూములు సేకరించేందుకు సిద్ధం అవుతోంది. మరో 44 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుండటంతో రైతులే స్వయంగా ముందుకొస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం భూములు తీసుకుంటే రైతులు వ్యతిరేకిస్తారు. ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వంపై పోరాడుతారు.

కోర్టు కేసుల దాకా వెళ్లి తమ భూములు మాత్రం ఇవ్వరు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ లో సాగుతోంది. మా భూములు తీసుకోవాలంటే మా భూములు తీసుకోవాలంటూ స్వయంగా రైతులే నిరసనకు దిగుతున్నారు. భూములు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఇది చూసి అధికారులు కూడా షాక్ అవుతున్నారు. రైతుల్లో ఈ మార్పు రావడానికి కారణం ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం అందించిన మేలు, వారికి జరుగుతున్న అభివృద్ధి. తమ భూములు ఇస్తే తాము కూడా అభివృద్ధి చెందుతామని రైతులు భావిస్తున్నారు. అంతే కాకుండా తమకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందనేది వారి నమ్మకం.

అందుకే ఈ 44వేల ఎకరాల సమీకరణ ప్రభుత్వానికి అసలు పెద్ద కష్టమే కావట్లేదు. వద్దన్నా భూములు ఇచ్చేలా ఉన్నారు రైతులు. త్వరలోనే దీనిపై జీవో కూడా విడుదలయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రైతులు ఇచ్చిన ప్రతి ఎకరానికి సరిపడా ప్రతిఫలం ప్రభుత్వం అందిస్తోంది. ఎవరికీ సాయం ఆపకపోవడంతో రైతుల్లో నమ్మకం పెరిగింది. అమరావతిలో ఎక్కడా రైతులకు అన్యాయం జరగకపోవడం మరో అంశం. ఏదేమైనా అమరావతి విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న మార్క్ వ్యూహం బాగా కలిసి వస్తోందనే టాక్ వినిపిస్తోంది.

ఇలాగే సాగితే గనక.. రాబోయే మూడేళ్లలో అమరావతి రూపు రేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు తన హయాంలోనే అమరావతి, పోలవరం రెండు పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. తన రాజకీయ చరిత్రలో ఈ రెండూ మైల్ స్టోన్ లాగా నిలుస్తాయి. అందుకే ఆయన పట్టుబట్టి మరీ అటు కేంద్రంతో, ఇటు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతూ పనులు ఆగకుండా చూసుకుంటున్నారు.

సినిమా

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

డైరెక్టర్ బాబీకి ఖరీదైన వాచ్ ఇచ్చిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్లను ఎంతగా ప్రోత్సహిస్తారో తెలిసిందే. ఇక తనతో పనిచేసిన వారికి ఎప్పుడూ ఎంకరేజ్ మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బాబీకి కూడా...

వార్2 టీజర్.. మీ ప్రేమకు ఉప్పొంగిపోయా.. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్2 టీజర్ మే20న విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ భారీ రెస్పాన్స్...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

‘షష్టి పూర్తి’ షూటింగ్ లో ఎన్నో నేర్చుకున్నా.. ప్రమోషన్స్‌లో హీరోయిన్ ఆకాంక్ష సింగ్

షష్టిపూర్తి సినిమా అద్భుతమైన కథతో రాబోతోందని.. ఈ మూవీతో తాను ఎన్నో నేర్చుకున్నట్టు హీరోయిన్ ఆకాంక్ష సింగ్ చెప్పింది. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా...

Nara Lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ‘యువగళం’ పుస్తకం ఆవిష్కరణ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో...

కట్టుబట్టలతో రోడ్డుపై పడేశారు.. మరోసారి విష్ణుపై మనోజ్ ఫైర్..

మంచు ఫ్యామిలీలో గొడవలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మనోజ్ మరోసారి విష్ణుపై సెటైర్లు వేశాడు. మనోజ్, నారా...

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల లాగా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమం...

రైతు సమస్యలపై ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వివిధ రకాల...