ఏపీ రాజధాని అమరావతి మళ్లీ నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. గత ఐదేళ్లు అసలు అమరావతి ఊసే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు మళ్లీ తన మార్క్ చూపిస్తుండటంతో.. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఐదేళ్లలో ప్రాజెక్టులు అమరావతికే రాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేష్ ఆయా సంస్థలను కలిసి అమరావతికి రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. దావోస్ పర్యటన తర్వాత అమరావతికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. దీంతో మొన్నట వరకు లోన్లే ఇవ్వం అని చెప్పిన ఎస్బీఐ, యానిమల్ బ్యాంకులు కూడా అభివృద్ధిని చూసి లోన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.
ఇంకో వైపు కేంద్రం కూడా భారీగా సాయం చేస్తోంది. ఇప్పటికే సెంట్రల్ బడ్జెట్ లో వేల కోట్లు కేటాయించింది. త్వరలోనే రైలు, రోడ్డు మార్గాలను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతోంది. ఇలా ఏపీ రాజధాని కోసం అందరూ సహకరిస్తుండటంతో రైతుల్లో నమ్మకం పెరిగింది. అమరావతి కోసం ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ భూములు సేకరించేందుకు సిద్ధం అవుతోంది. మరో 44 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుండటంతో రైతులే స్వయంగా ముందుకొస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం భూములు తీసుకుంటే రైతులు వ్యతిరేకిస్తారు. ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వంపై పోరాడుతారు.
కోర్టు కేసుల దాకా వెళ్లి తమ భూములు మాత్రం ఇవ్వరు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ లో సాగుతోంది. మా భూములు తీసుకోవాలంటే మా భూములు తీసుకోవాలంటూ స్వయంగా రైతులే నిరసనకు దిగుతున్నారు. భూములు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఇది చూసి అధికారులు కూడా షాక్ అవుతున్నారు. రైతుల్లో ఈ మార్పు రావడానికి కారణం ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం అందించిన మేలు, వారికి జరుగుతున్న అభివృద్ధి. తమ భూములు ఇస్తే తాము కూడా అభివృద్ధి చెందుతామని రైతులు భావిస్తున్నారు. అంతే కాకుండా తమకు ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందనేది వారి నమ్మకం.
అందుకే ఈ 44వేల ఎకరాల సమీకరణ ప్రభుత్వానికి అసలు పెద్ద కష్టమే కావట్లేదు. వద్దన్నా భూములు ఇచ్చేలా ఉన్నారు రైతులు. త్వరలోనే దీనిపై జీవో కూడా విడుదలయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రైతులు ఇచ్చిన ప్రతి ఎకరానికి సరిపడా ప్రతిఫలం ప్రభుత్వం అందిస్తోంది. ఎవరికీ సాయం ఆపకపోవడంతో రైతుల్లో నమ్మకం పెరిగింది. అమరావతిలో ఎక్కడా రైతులకు అన్యాయం జరగకపోవడం మరో అంశం. ఏదేమైనా అమరావతి విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న మార్క్ వ్యూహం బాగా కలిసి వస్తోందనే టాక్ వినిపిస్తోంది.
ఇలాగే సాగితే గనక.. రాబోయే మూడేళ్లలో అమరావతి రూపు రేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు తన హయాంలోనే అమరావతి, పోలవరం రెండు పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. తన రాజకీయ చరిత్రలో ఈ రెండూ మైల్ స్టోన్ లాగా నిలుస్తాయి. అందుకే ఆయన పట్టుబట్టి మరీ అటు కేంద్రంతో, ఇటు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతూ పనులు ఆగకుండా చూసుకుంటున్నారు.