Switch to English

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,174FansLike
57,764FollowersFollow

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల చేస్తూ ఉద్యోగుల ముఖాల్లో ఆనందం నింపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఖాతాల్లో దాదాపు రూ.1,100 కోట్లను ప్రభుత్వం జమ చేయడం విశేషం.

2019 నుంచి సుమారు ఐదేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఇప్పుడు క్లియర్ చేయడం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలిగింది. ఈ నిర్ణయంతో సుమారు 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, మరో 2.70 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందారు. ఒక్కో ఉద్యోగి ఖాతాలోకి వారి వేతనాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు జమ కావడంతో పండుగ వేళ ఇంటింటా సంతోష వాతావరణం నెలకొంది.

ఇదే సమయంలో రాష్ట్రంలోని 55 వేల మంది పోలీసులకు కూడా శుభవార్త చెప్పింది ప్రభుత్వం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేసి, వారి కష్టానికి గౌరవం ఇచ్చింది. అలాగే, నాబార్డు మరియు విదేశీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.1,243 కోట్ల బకాయిలను చెల్లించింది. దీంతో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఏర్పడింది.

ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంగా, పండుగలోపే బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసి వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గత ప్రభుత్వంలో జీతాలకే ఇబ్బంది పడ్డ పరిస్థితి నుంచి, ఇప్పుడు పండుగకు ముందే బకాయిలు అందుకునే స్థాయికి రావడం పట్ల ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగులు – పెన్షనర్లలో నమ్మకాన్ని పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వీరి పెళ్లి జరుగుతుందనే సమాచారం...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

పాలేరు జలాశయంలో కారు ప్రమాదం.. రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి, మీడియా కథనాలపై తీవ్ర విమర్శలు

ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందడం సంచలనం సృష్టించింది. ప్రమాద సమయంలో వాహనంలో వెనుక సీటులో ఉన్న శ్రీనివాస్...

పార్టీకి పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళం: జనసేన కొత్త సభ్యత్వానికి శ్రీకారం

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రూ.2 కోట్ల విరాళం అందించి...