ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పెట్టుబడులు ఊపందుకున్నాయి. గతంలో 2014-2019 లో కూడా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోనే పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే బాబు పాలనలో కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఆయన బ్రాoడ్ తోనే ఆటోమోబైల్ రంగంలో ఇసుజు, కియా మోటార్, అపోలో టైర్లు, అశోక్ లేలాండ్, భారతపోర్జ్, హీరో గ్రూపు రాగా, ఐటీ సెల్ ఫోన్ తయారీ రంగం లో ఫాక్స్ కాన్, సెల్ కాన్, ప్లెక్స్ ట్రానిక్స్, డిక్స న్, రిలయన్స్, టీసియల్, ఓల్టాస్ లాంటి పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి.
ఏ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా సరే అక్కడకు పరిశ్రమలు రావాలి. ఉద్యోగాలు సృష్టించబడాలి. ప్రజల ఆదాయ మార్గాలు పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలి. అప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్ గా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఆయన పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నారు. చంద్రబాబు గతంలో పెట్టుబడుల రాక పట్ల చూపించిన శ్రద్ధ, తపన గురించి పరిశ్రమల రంగంలో మంచి అభిప్రాయం ఉంది. అందుకే ఆయన హయాంలోనే పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి. పెట్టుబడులు అనేవి ఒక భరోసా ఉంటేనే వస్తాయని.. అక్కడున్న నాయకత్వం నుంచి నమ్మకం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని ఇప్పటికే వచ్చిన చాలా కంపెనీల ప్రతినిధులు చెబుతున్న మాట.
కానీ వైఎస్ జగన్ హయాంలో ఏం జరిగిందో అందరూ చూశారు. 2019 -2024 మే వరకు రాష్ట్రంలో అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఏపీ నుంచి పెట్టుబడులు వెళ్లిపోవడంపై అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చలు జరిగాయి. దాంతో జగన్ హయాంలో కొత్త వారెవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. జగన్ హయాంలో జరిగిన నష్టాన్ని ఇప్పుడు చంద్రబాబు భర్తీ చేస్తున్నారు. అనేక కంపెనీలను తిరిగి ఏపీకి రప్పిస్తున్నారు 11 నెలల కాలంలో ఎస్ఐపీబీ ఇప్పటికి ఆరుసార్లు సమావేశం అయి 76 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
వీటి ద్వారా 4,50,934 మంది ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. చివరగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో 19 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టులతో ఏపీకి ఎంత లేదన్నా రూ.33 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని 50 వేల హోటల్ రూములు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే ఏపీలో రద్దీగా ఉండే 21 ఆలయాల్లో వసతి సౌకర్యం పెంచే దిశగా నిధులు కేటాయిస్తున్నారు.
ఇలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఏపీకి. పైగా పెట్టుబడులు ఒకే జిల్లాలో కాకుండా అన్ని జిల్లాల్లో సమాంతరంగా ఉండేలా చూస్తున్నారు. డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కుమరవరం, అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైంది. ఇది రూ.1,560 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూ.1,400 కోట్ల పెట్టుబడులతో పాలసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లాలో వస్తోంది. అలాగే కర్నూలులో పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అనకాపల్లిలోరూ.2,300 కోట్ల పెట్టుబడులులు వచ్చాయి. ఇలా అన్ని జిల్లాల్లో పెట్టుబడులు సమాంతరంగా తీసుకొస్తూ అన్ని జిల్లాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు.
