తెలుగుదేశం పార్టీని వైఎస్సార్సీపీ టార్గెట్ చేసిన మాట వాస్తవం. అది అమరావతి భూముల వ్యవహారం కావొచ్చు, ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల వ్యవహారాలు కావొచ్చు.. ఇతరత్రా అంశాలు కావొచ్చు. ఎక్కడన్నా ఓ చిన్న లింకు దొరికితే.. ఏకంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కటకటాల వెనక్కి పంపించేయాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్ళూరుతోంది.
ప్రభుత్వం తరఫున ఏదో ఒక ఆరోపణ రావడం.. ఆ వెంటనే వైసీపీ నేతలు, ‘చంద్రబాబుని వెంటనే జైల్లో పెట్టాలి..’ అనడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతూనే, చంద్రబాబుని పూర్తిస్థాయిలో టార్గెట్ చేయడం షురూ అయ్యింది. ఇక, అక్కడినుంచీ అవకాశం కోసం జగన్ ప్రభుత్వం ఎదురుచూస్తూనే వుంది. ఈ క్రమంలో ఒక్క అవకాశాన్నీ వదులుకునేందుకు వైఎస్సార్సీపీ వెనుకంజ వేయలేదు.
అయితే, చిత్రంగా.. చంద్రబాబు మీద ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ‘దమ్ముంటే నా మీద కేసులు నమోదు చేయండి..’ అని చంద్రబాబు పదే పదే సవాల్ విసురుతున్నారు. ‘ఆ ముచ్చట తీర్చేస్తాం..’ అని బొత్స సత్యనారాయణ లాంటి వైసీపీ సీనియర్ నేతలు వెటకారం చేస్తున్న విషయం విదితమే.
అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలోనే మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి వైసీపీ ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతోందట. ‘అది అరెస్టే కావొచ్చు..’ అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కాగా, ఇటీవల వెలుగు చూసిన ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై ఆరోపణలు చేస్తూ వచ్చిన వైసీపీ, ఇప్పుడు గేరు మార్చి.. ‘తెరవెనుక వున్నది చినబాబేనట.. ఈ విషయమై అచ్చెన్నాయుడు కూడా తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట..’ అంటూ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది.
నిజానికి, చంద్రబాబుని దెబ్బ కొట్టడం కన్నా.. లోకేష్ని దెబ్బ కొడితే.. ఆ దెబ్బ చంద్రబాబుకి ఇంకా గట్టిగా తగులుతుందన్నది వైసీపీ ఆలోచన. సో, ముందు లోకేష్.. ఆ తర్వాతే చంద్రబాబు అన్న మాట. అయితే, ఈ రాజకీయ క్రీడపై సవాలక్ష అనుమానాలూ వ్యక్తమవుతున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
999320 91812I always was concerned in this subject and stock still am, regards for posting . 891776