తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతాననీ, అప్పటివరకు అసెంబ్లీకి వచ్చేది లేదని చెబుతూ, రాష్ట్ర అసెంబ్లీని కౌరవ సభగా అభివర్ణించారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తన సతీమణి భువనేశ్వరి, ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదనీ, అలాంటి భువనేశ్వరి మీద అసెంబ్లీలో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు వాపోయారు.
రానురాను రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత దిగజారుడుతనాన్ని సంతరించుకుంటున్నాయి. ‘ఇంతకన్నా పతనం ఇంకేమీ వుండదు..’ అని జనం ముక్కున వేలేసుకుంటున్న ప్రతిసారీ, అంతకన్నా దిగజారుడుతనాన్ని చూపిస్తున్నారు రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులు.
తాజాగా చంద్రబాబు విషయంలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు.. ఆ దిగజారుడుతనానికే పరాకాష్ట. నిజానికి, ఇలాంటి సందర్భాల్లోనే ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలి. అయితే, చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్. ఆయన విషయంలో ‘బూతులు’ మాట్లాడటానికి వైసీపీలో చాలామంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారిని ముఖ్యమంత్రి కంట్రోల్ చేయలేకపోతుండడమంటే, ముఖ్యమంత్రి స్వయంగా వారిని ప్రోత్సహిస్తున్నారని అనుకోవాలేమో.
సరే, చంద్రబాబు హయాంలో.. వైసీపీ నేతల మీద అసెంబ్లీలో ఎలా తెలుగు తమ్ముళ్ళు వ్యవహరించారన్నది వేరే చర్చ. ‘టిట్ ఫర్ టాట్’ అనేది రాజకీయాల్లో వాంఛనీయం కాదు. రాజకీయ నాయకులా.? వీధి రౌడీలా.? అని ప్రశ్నించాల్సి వస్తే, ఆ వీధి రౌడీలు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చిందిప్పుడు రాజకీయ నాయకుల్ని చూసి.
In a reaction to #YSRCP leaders' comments on his family in AP assembly, Former CM #ChandrababuNaidu breaks down in a press meet today. #TDP #TDPTwitter @Ncbn @NaraLokesh #chandrababu #YSJagan #YSRCP #APAssembly pic.twitter.com/OkROojk5Hf
— TeluguBulletin.com (@TeluguBulletin) November 19, 2021
21864 679188Nie and informative post, your every post worth atleast something. 19680
994956 158424But wanna admit that this really is really helpful , Thanks for taking your time to write this. 158356