Switch to English

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విజయ్ నెహ్రా ఈ నెల 12న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్‌కు వివరణాత్మక లేఖ రాశారు. లేఖకు అనుబంధంగా 27 పేజీల మార్గదర్శకాలను పంపిస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వేగంగా అందించేందుకు పీపీపీ మోడల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కొంది.

ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా రాసిన లేఖను ప్రస్తావించిన కేంద్ర అధికారులు, వైద్య విద్యతో పాటు కీలక వైద్య సేవల విస్తరణకు పీపీపీ అత్యంత అనుకూల సాధనమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండో లేఖ ద్వారా రాష్ట్రం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అంశాలను స్పష్టంగా సూచించారు. ముఖ్యంగా న్యూక్లియర్ మెడిసిన్, మొబైల్ మెడికల్ యూనిట్లు, దంత వైద్య సేవలు, రేడియాలజీ సేవలు, క్యాన్సర్ డే కేర్ సెంటర్ల విస్తరణపై దృష్టి పెట్టాలని కేంద్రం కోరింది.

ఎక్విప్–ఆపరేట్–మెయింటైన్ (EOM), ఆపరేట్ అండ్ మెయింటైన్ (O&M) మోడళ్ల ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యంతో సేవల లభ్యతను పెంచాలని, 5 నుంచి 10 సంవత్సరాల కాలానికి అనుగుణంగా చెల్లింపు విధానాలపై కూడా మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా క్యాన్సర్, గుండె సంబంధిత, నరాల వ్యాధులకు మెరుగైన సేవలు అందించవచ్చని, అయితే మధ్యతరహా, చిన్న పట్టణాల్లో ఈ సేవలు తీవ్రంగా కొరతగా ఉన్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. క్యాన్సర్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్–సీటీ, స్పెక్ట్ ఇమేజింగ్, రేడియోథెరపీ సేవలను గ్రామీణ, సెమీఅర్బన్ ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

దంత ఆరోగ్యంపై కూడా కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. 60 నుంచి 90 శాతం వరకు ప్రజలు దంత సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, అవసరమైన సేవలు అందుబాటులో లేవని పేర్కొంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో దంత వైద్య పరికరాలు, వైద్యుల కొరత ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీపీపీ ద్వారా దంత సేవలను బలోపేతం చేయాలని సూచించింది. అలాగే ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ వంటి వ్యాధి నిర్ధారణ పరికరాల లభ్యతను విస్తరించేందుకు పీపీపీ విధానం ఉపయోగపడుతుందని తెలిపింది.

క్యాన్సర్‌పై పోరాటంలో ముందస్తు స్క్రీనింగ్, నిర్ధారణ కోసం డే కేర్ సెంటర్లు కీలకమని కేంద్రం పేర్కొంది. 2027–28 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించింది. ఈ దిశగా 2025–26 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 14 సెంటర్లు మంజూరు చేసినట్లు లేఖలో పేర్కొంది. ఈ లేఖ వివరాలను కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

డిజాస్టర్ తర్వాత కూడా తగ్గని రామ్ చరణ్ క్రేజ్.. ‘పెద్ది’ ఓవర్సీస్ డీల్ ఎంతంటే?

గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా రామ్ చరణ్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని తాజా ఓవర్సీస్ బిజినెస్ చెబుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలకు...

లోకేష్: ‘యువతకు ఉద్యోగాలే మా లక్ష్యం’ – మండలిలో 99 పైసల భూ కేటాయింపులపై వాడీవేడి చర్చ

శాసనమండలిలో పరిశ్రమలకు 99 పైసలకే భూముల కేటాయింపులపై తీవ్ర స్థాయిలో వాడీవేడి చర్చ జరిగింది. వైసీపీ సభ్యుల ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ ధీటుగా సమాధానం ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ...

ప్రతిపక్ష హోదా రాని వైసీపీపై జనసేన ఎమ్మెల్యేల ఘాటు వ్యాఖ్యలు

వైసీపీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదని జనసేన ఎమ్మెల్యేలు లోకం మాధవి, సుందరపు విజయ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వారు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ...

నన్నయ్య యూనివర్సిటీపై ఆరోపణలు.. అనుమతుల అక్రమాలపై లోకేష్ హెచ్చరిక

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కళాశాలల అనుమతుల విషయంలో అవకతవకలకు సంబంధించి ఆధారాలు పంపితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు....